News September 28, 2024
సీఎం పర్యటనల కోసం అడ్వాన్స్ టీమ్స్ ఏర్పాటు

ఏపీ వ్యాప్తంగా సీఎం చంద్రబాబు పర్యటనల ముందస్తు ఏర్పాట్ల కోసం రెండు అడ్వాన్స్ టీమ్స్ను ప్రభుత్వం నియమించింది. రెవెన్యూ, పోలీస్, సమాచార, ప్రణాళిక శాఖలకు చెందిన అధికారులు ఈ బృందాల్లో ఉంటారు. వీరు చేయాల్సిన పనులపై ప్రభుత్వం మార్గదర్శకాలు సైతం విడుదల చేసింది. సీఎం పర్యటనలకు 24 గంటల ముందు ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేస్తాయి.
Similar News
News November 27, 2025
మల్లాపూర్: నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

మల్లాపూర్ మండలం గొర్రెపల్లి, సాతారం, మొగిలిపేట, రాఘవపేట, కుస్తాపూర్, కొత్త దామరాజ్ పల్లి గ్రామాలలో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలను గురువారం అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ పరిశీలించారు. నోటీస్ బోర్డులపై అతికించిన నోటిఫికేషన్ పత్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలన్నారు. నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు.
News November 27, 2025
పాక్ న్యూక్లియర్ కంట్రోల్స్ ఆసిమ్ మునీర్ చేతికి!

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఆ దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF)గా బాధ్యతలు చేపట్టారు. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు అతను అధిపతిగా ఉంటారు. ఆ దేశ ప్రధానికి సరిసమానమైన పవర్స్ మాత్రమే కాదు లీగల్ ప్రొటెక్షన్ కూడా ఆసిమ్ మునీర్కు ఉంటుందని చెబుతున్నారు. అతనికి కేసుల నుంచి లైఫ్ టైమ్ ఇమ్యూనిటీతో పాటు న్యూక్లియర్ వెపన్స్ కంట్రోల్స్ కూడా అతని చేతికే ఇస్తారని తెలుస్తోంది.
News November 27, 2025
వారికి నిద్ర అవసరం: సుందర్ పిచాయ్

‘జెమిని 3’ మోడల్ కోసం తన బృందం కొన్ని వారాల పాటు విరామం లేకుండా పని చేసిందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ‘ఉద్యోగులంతా ఎంతో అలసిపోయారు. కొందరికి నిద్ర అవసరం. ఇప్పుడు తగిన విశ్రాంతి దొరుకుతుందని ఆశిస్తున్నా’ అని చెప్పారు. ‘గూగుల్ ఏఐ: రిలీజ్ నోట్స్’ పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడారు. జెమిని 3 ఏఐ మోడల్ను ఇటీవల గూగుల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.


