News November 28, 2024
MH ఓటింగ్ శాతంపై మాజీ CEC అనుమానం

మహారాష్ట్ర ఎన్నికలపై మాజీ CEC ఖురేషీ అనుమానం వ్యక్తం చేశారు. నవంబర్ 20న సాయంత్రం 5 గంటలకు 55% ఉన్న ఓటింగ్ మరుసటి రోజుకు 67% అయినట్లు అధికారులు ప్రకటించారని, ఇంత వ్యత్యాసమేంటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలింగ్ స్టేషన్లో నమోదైన ఓట్ల వివరాలను PO ఫామ్ 17Cలో అదే రోజు వెల్లడిస్తారని, తర్వాత రోజుకు అది ఎలా మారుతుందో అర్థం కావట్లేదన్నారు. ఇలా జరిగితే ఎన్నికల ప్రక్రియను ఎవరూ నమ్మబోరని చెప్పారు.
Similar News
News November 28, 2025
సచిన్-ద్రవిడ్ రికార్డు బ్రేక్ చేయనున్న రో-కో!

నవంబర్ 30 నుంచి టీమ్ ఇండియా, సౌతాఫ్రికా మధ్య 3వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. రోహిత్-కోహ్లీ జోడీకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. రాంచీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో వీళ్లు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. వీళ్లు జోడీగా 391 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. సచిన్-ద్రవిడ్ కూడా సరిగ్గా అన్నే మ్యాచులు కలిసి ఆడారు. రాంచీలో రోహిత్-కోహ్లీ కలిసి క్రీజులో నిల్చుంటే చాలు సచిన్-ద్రవిడ్ రికార్డు బద్దలవుతుంది.
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.


