News June 4, 2024

రాజంపేటలో మాజీ సీఎం లీడింగ్

image

✒ రాజంపేట ఎంపీ- కిరణ్ కుమార్ రెడ్డి(BJP) 3,000 ఓట్ల లీడింగ్
✒ ఉరవకొండ ఎమ్మెల్యే – పయ్యావుల కేశవ్(TDP) లీడింగ్
✒ రాయదుర్గం- కాల్వ శ్రీనివాసులు(TDP) లీడింగ్
✒ కడప ఎమ్మెల్యే- మాధవీరెడ్డి(TDP) 2,158 ఓట్ల లీడింగ్
✒ శింగనమల- బండారు శ్రావణి(TDP) ఆధిక్యం
✒ నంద్యాల- ఫరూఖ్(TDP) లీడింగ్

Similar News

News October 8, 2024

పోలవరానికి రూ.2,800 కోట్లు విడుదల

image

AP: పోలవరం ప్రాజెక్టుకు రూ.2,800 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. రీయింబర్స్‌మెంట్ కింద రూ.800 కోట్లు, అడ్వాన్సుగా రూ.2,000 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలుత సొంత నిధులతో పనులు చేయిస్తే, వాటికి కేంద్రం దశలవారీగా డబ్బు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6వేల కోట్లు, వచ్చే ఏడాది రూ.6,157 కోట్ల మంజూరుకు కేంద్రం ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

News October 8, 2024

YELLOW ALERT: రెండు రోజులు వర్షాలు

image

TGలో 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, హైదరాబాద్, నల్గొండ, వరంగల్, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో నేడు APలోని మన్యం, అల్లూరి, ఉ.గో, రాయలసీమ, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయని APSDMA పేర్కొంది.

News October 8, 2024

మంత్రిపై పరువు నష్టం కేసు.. విచారణకు నాగార్జున

image

TG: కాంగ్రెస్ మంత్రి సురేఖపై పరువు నష్టం కేసులో నేడు హీరో నాగార్జున విచారణకు హాజరు కానున్నారు. నాగచైతన్య-సమంత విడాకుల విషయమై మంత్రి చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబం పరువు తీశాయని ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై నిన్న కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలం ఇవ్వాలని పేర్కొంటూ జడ్జి శ్రీదేవి విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు.