News April 7, 2024

కశ్మీర్‌లో తలపడనున్న మాజీ సీఎంలు

image

జమ్మూకశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకుంది. అనంతనాగ్-రాజౌరీ స్థానం నుంచి ఇద్దరు మాజీ సీఎంలు నేరుగా తలపడనున్నారు. గులాంనబీ ఆజాద్(DPAP), మెహబూబా ముఫ్తీ(PDP) తమ అభ్యర్థిత్వాలను ప్రకటించారు. అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా బరిలో దిగనుంది. దీంతో పోటీ రసవత్తరంగా ఉండనుంది. ముఫ్తీకి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుండగా, ఆజాద్ వెనుక బీజేపీ ఉందని విపక్షాలు అంటున్నాయి.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News October 9, 2024

హరియాణాలో ఓవర్ కాన్ఫిడెన్స్‌ వల్లే ఓడిపోయాం: కాంగ్రెస్ మాజీ ఎంపీ

image

ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే హరియాణాలో ఓడిపోయామని కర్ణాటక కాంగ్రెస్ మాజీ ఎంపీ డీకే సురేశ్ అంగీకరించారు. ఎన్నికల ప్రక్రియలో పార్టీ అంతర్గత యంత్రాంగం అలసత్వమే కొంప ముంచిందన్నారు. తమ అతిపెద్ద బలహీనత ఇదేనన్నారు. హైకమాండ్ త్వరలోనే దీనిపై సమీక్షిస్తుందని వెల్లడించారు. జమ్మూకశ్మీర్ ప్రజలు NC, కాంగ్రెస్ కూటమికి చక్కని తీర్పునిచ్చారని పేర్కొన్నారు. తమ కూటమి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.

News October 9, 2024

నిర్వాసితులను ఒప్పించాకే బుడమేరు ప్రక్షాళన: పవన్

image

AP: విజయవాడ పరిధిలో బుడమేరు ప్రక్షాళనను పద్ధతిగా చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ముందుగా నిర్వాసితుల్లో అవగాహన పెంచుతామని చెప్పారు. నిర్వాసితులను ఒప్పించాకే బుడమేరు ఆక్రమణలను తొలగిస్తామని పేర్కొన్నారు. వారికి ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీనిచ్చారు.

News October 9, 2024

రాష్ట్రంలో పండుగ వాతావరణం లేదు: KTR

image

TG: రాష్ట్రంలో పండుగ వాతావరణం కనపడటం లేదని KTR అన్నారు. ‘ఆడబిడ్డలకు చీరలు లేవు. రైతులకు రైతుబంధు లేదు. ఆఖరికి బతుకమ్మ ఆడేందుకు డీజేలు కూడా లేవు. ఏ అధికారి తమ ఇంటికి వచ్చినా ఇల్లు కూల్చేస్తారని ప్రజలు భయపడుతున్నారు. ప్రజల సొమ్ము దోచుకునేందుకే మూసీ ప్రక్షాళన అంటున్నారు. ఎన్నికల సమయంలో రేవంత్ హామీ ఇచ్చిన ‘మహాలక్ష్మీ’ పథకం ఏమైంది? వీటిపై అందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.