News April 6, 2025

ధోనీ రిటైర్మెంట్‌పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

image

CSK స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోనీ 2023 ఐపీఎల్ సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాల్సిందని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అన్నారు. ఆ సమయంలో ప్రకటన చేసి ఉంటే ఘనంగా వీడ్కోలు దక్కేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కీపింగ్ అదరగొడుతున్నా ఆయన బ్యాటింగ్ తీరుపై చెన్నై అభిమానులే అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కాగా నిన్నటి మ్యాచుతోనే ధోనీ వీడ్కోలు పలుకుతారని ప్రచారం జరిగినా కోచ్ ఫ్లెమింగ్ అలాంటి లేదన్నారు.

Similar News

News April 7, 2025

మీకోసం నాలుగు సూత్రాలు!

image

హెల్తీ లైఫ్ కోసం వ్యాయామం ఎంత ముఖ్యమో డైట్, సరైన దినచర్య కూడా అంతే ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ‘రోజులో 12 గంటల వ్యవధిలో ఏమీ తినకుండా ఉండాలి. వారానికి 2 సార్లు 5 ని.ల చొప్పున స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి. నిద్ర మన జీవితాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ 20ని.లు ఎండలో నిలబడాలి. రోజులో 15 ని.లు మీకోసం కేటాయించుకొని ఫోన్ పక్కన పెట్టి ఇష్టమైన పనులు చేయాలి’ అని వైద్యులు చెబుతున్నారు.

News April 7, 2025

ప్రయాణికురాలి మృతి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

image

ముంబై నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానం ఛత్రపతి శంభాజీనగర్‌‌లోని ఎయిర్‌పోర్టులో నిన్న రాత్రి 10 గం.కు అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానంలో ప్రయాణిస్తున్న మీర్జాపూర్‌కు చెందిన మహిళ సుశీల(89)కి అసౌకర్యంగా అనిపించడంతో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. మెడికల్ టీం పరిశీలించి, అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. ఆ తర్వాత మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం విమానం వారణాసికి పయనమైంది.

News April 7, 2025

స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉండండి: రాహుల్ గాంధీ

image

స్టాక్ మార్కెట్లపై కాంగ్రెస్ అగ్రనేత, LOP రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బులు సంపాదించడం ఓ భ్రమ అని, యువత దాని నుంచి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఒకశాతం జనాభా మాత్రమే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతోందని బిహార్‌లోని బెగుసరాయ్‌లో <<16019988>>‘తెల్ల టీషర్ట్’<<>> ఉద్యమంలో పాల్గొన్న అనంతరం వ్యాఖ్యానించారు.

error: Content is protected !!