News October 5, 2024
దేశంలో కాంగ్రెస్కు పూర్వ వైభవం!
కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం ప్రారంభమైనట్టేనని హరియాణా, JK ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 99 స్థానాల్లో గెలుపొందిన ఆ పార్టీ బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ఇక ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఈ అంచనాలు గనుక నిజమైతే దేశంలో కాంగ్రెస్ మరింత పుంజుకోవడం ఖాయమని పేర్కొంటున్నారు.
Similar News
News October 5, 2024
త్వరలో CSK ప్రతినిధులతో ధోనీ భేటీ?
ఈ నెలలో సీఎస్కే ప్రతినిధులతో మహేంద్ర సింగ్ ధోనీ ముంబైలో సమావేశం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే సీజన్లో తాను ఆడేదీ లేనిదీ వారితో తేల్చి చెప్తారని తెలుస్తోంది. కాగా సీఎస్కే మాత్రం ధోనీ అన్క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో రిటైన్ చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కనీస ధర రూ.4 కోట్లు చెల్లించి ఆయనను దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
News October 5, 2024
అరుదైన రికార్డు ముంగిట హార్దిక్
బంగ్లాతో T20 సిరీస్ ముంగిట భారత పేస్ ఆల్రౌండర్ హార్దిక్ను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇప్పటి వరకు T20ల్లో 86 వికెట్లు తీసిన పాండ్య మరో 5 తీస్తే ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత పేసర్గా నిలుస్తారు. ప్రస్తుతం ఈ రికార్డు భువనేశ్వర్(90) పేరిట ఉంది. మొత్తంగా చూసుకుంటే స్పిన్నర్ చాహల్ 96 వికెట్లతో టాప్లో ఉన్నారు. బుమ్రా 86 వికెట్లు తీసినప్పటికీ అతడు బంగ్లాతో సిరీస్ ఆడటం లేదు.
News October 5, 2024
ఫొటో గ్యాలరీ.. హంసవాహనంపై తిరుమలేశుడు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన ఇవాళ వేంకటేశ్వరుడు హంసవాహనంపై తిరుమల మాడ వీధుల్లో విహరించారు. సరస్వతీమూర్తి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. కనులపండువగా సాగిన మహోత్సవ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.