News September 13, 2025

మేఘాలయ మాజీ సీఎం కన్నుమూత

image

మేఘాలయ మాజీ సీఎం D.D. లాపాంగ్(91) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన షిల్లాంగ్‌లోని బెథానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. లాపాంగ్ 1992 – 2010 మధ్య 4 సార్లు CMగా పని చేశారు. 1972లో రాజకీయాల్లోకి ప్రవేశించి తొలుత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆపై కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేఘాలయ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో లాపాంగ్ ఒకరిగా నిలిచారు.

Similar News

News September 13, 2025

3,115 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ

image

ఈస్టర్న్ రైల్వేలో 3,115 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే(SEP 13) చివరితేదీ. ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, పెయింటర్, లైన్‌మెన్, వైర్‌మెన్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్ విభాగాల్లో ఖాళీలున్నాయి. టెన్త్, ఇంటర్, ఉద్యోగాన్ని బట్టి ఐటీఐలో పాసవ్వాలి. వయసు 15-24ఏళ్ల లోపు ఉండాలి. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వెబ్‌సైట్: <>https://rrcrecruit.co.in/<<>>

News September 13, 2025

ఫేస్ టేపింగ్ చేస్తున్నారా?

image

ముఖంపై ముడతలు తగ్గాలని చాలామంది ఖరీదైన బొటాక్స్ ట్రీట్మెంట్ల వైపు వెళ్తుంటే మరికొందరు ఫేస్ టేపింగ్ చేసుకుంటారు. దీనివల్ల తాత్కాలిక ప్రయోజనమే ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఫేస్ టేపింగ్ ఎక్కువగా చేసుకుంటే ముఖంపై ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇలా కాకుండా స్కిన్ కేర్‌పై దృష్టి పెట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే చర్మం అందంగా, యవ్వనంగా మెరుస్తుందని సూచిస్తున్నారు.

News September 13, 2025

సుశీలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

image

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా నిన్న బాధ్యతలు స్వీకరించిన <<17691512>>సుశీల<<>> కర్కీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్‌లో సోదర, సోదరీమణుల శాంతి, అభ్యున్నతికి భారత్ కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా అక్కడ Gen-G యువత ఇటీవల హింసాత్మక ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అధ్యక్షుడు పార్లమెంట్‌ను రద్దు చేసి నిరసనకారుల ప్రతిపాదన మేరకు సుశీలను ప్రధానిగా నియమించారు.