News September 14, 2024

జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

image

AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆ పార్టీని వీడనున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన జనసేనలో చేరుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయన సొంత నియోజకవర్గం జగ్గయ్యపేటలో మున్సిపల్ ఛైర్మన్ సహా 18 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనను ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా నియమిస్తారని టాక్ వినిపిస్తోంది.

Similar News

News November 18, 2025

జనవరిలో కొత్త ITR ఫారాలు: CBDT

image

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం వచ్చే ఏడాది APR 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ చట్టంలో ఉన్న రూల్స్‌తో ITR ఫారాలను జనవరినాటికి అందుబాటులోకి తేనున్నట్లు CBDT వెల్లడించింది. పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యమని పేర్కొంది. కొత్త చట్టానికి అనుగుణంగా అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్లలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఇక సరైన రిఫండ్ క్లెయిమ్‌లను DECలోగా పరిష్కరిస్తామని వివరించింది.

News November 18, 2025

జనవరిలో కొత్త ITR ఫారాలు: CBDT

image

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం వచ్చే ఏడాది APR 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ చట్టంలో ఉన్న రూల్స్‌తో ITR ఫారాలను జనవరినాటికి అందుబాటులోకి తేనున్నట్లు CBDT వెల్లడించింది. పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యమని పేర్కొంది. కొత్త చట్టానికి అనుగుణంగా అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్లలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఇక సరైన రిఫండ్ క్లెయిమ్‌లను DECలోగా పరిష్కరిస్తామని వివరించింది.

News November 18, 2025

రేపే అకౌంట్లలోకి రూ.7వేలు.. మీ పేరు ఉందా?

image

PM కిసాన్ 21వ విడత నిధులను కేంద్రం రేపు విడుదల చేయనుంది. అర్హులైన రైతుల ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.2 వేల చొప్పున ప్రధాని మోదీ జమచేస్తారు. అదే రోజున AP ప్రభుత్వం 2వ విడత అన్నదాత సుఖీభవ కింద అర్హులైన రైతులకు రూ.5వేల చొప్పున అందించనుంది. దీంతో ఈ 2 పథకాలకు అర్హులైన రైతుల అకౌంట్లలో రేపు రూ.7వేలు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ అర్హతను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.