News September 14, 2024

జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

image

AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆ పార్టీని వీడనున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన జనసేనలో చేరుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయన సొంత నియోజకవర్గం జగ్గయ్యపేటలో మున్సిపల్ ఛైర్మన్ సహా 18 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనను ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా నియమిస్తారని టాక్ వినిపిస్తోంది.

Similar News

News October 23, 2025

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

image

ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రా.ల బంగారం ధర రూ.810 తగ్గి ₹1,25,080కు చేరింది. 22 క్యారెట్ల 10g పసిడిపై రూ.750 పతనమై ₹1,14,650గా ఉంది. అటు KG వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,74,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 23, 2025

లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు

image

స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 760 పాయింట్ల లాభంతో 85,200 వద్ద, నిఫ్టీ 200 పాయింట్ల గెయిన్‌తో 26,085 వద్ద కొనసాగుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, టైటాన్, టీసీఎస్, టాటా స్టీల్ లాభాల్లో ఉండగా, మారుతి సుజుకీ, అపోలో హాస్పిటల్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఏడాది తర్వాత నిఫ్టీ 26 వేలు, సెన్సెక్స్ 85 వేల మార్కును చేరుకోవడం గమనార్హం.

News October 23, 2025

మద్యం టెండర్లకు నేటితో ముగియనున్న గడువు

image

తెలంగాణలో మద్యం టెండర్లకు నేటితో గడువు ముగియనుంది. 2,620 మద్యం షాపులకు ఇప్పటివరకు దాదాపు 90 వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 5 PM వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీంతో అప్లికేషన్లు లక్షకు చేరువయ్యే ఛాన్స్ ఉంది. ఈనెల 27న లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు జరగనుంది. అయితే దరఖాస్తు గడువు ఇప్పటికే ఒకసారి పొడిగించగా.. మరోసారి పెంచే ఛాన్స్ ఉండకపోవచ్చు.