News November 25, 2024
మాజీ MLA రామచంద్రారెడ్డి కన్నుమూత

TG: సిద్దిపేట జిల్లాకు చెందిన మాజీ MLA డి. రామచంద్రారెడ్డి(85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన HYDలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయారు. మాజీ సీఎం కేసీఆర్ సమకాలికులైన ఈయన 1985లో దొమ్మాట నియోజకవర్గం(ప్రస్తుతం దుబ్బాక) నుంచి TDP ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామచంద్రారెడ్డికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారి వద్దే ఉంటున్నారు. స్వస్థలం సిద్దిపేట జిల్లా కొండపాక.
Similar News
News January 9, 2026
తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం

తిరుమల కల్తీ నెయ్యి కేసులో A-34గా ఉన్న TTD డెయిరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం నెల్లూరు ACB కోర్టులో పిటిషన్ వేశారు. నెయ్యి క్వాలిటీ లేకున్నా ఆయన లంచాలు తీసుకుని సర్టిఫికెట్లు ఇచ్చారని ప్రభుత్వ లాయర్ వాదించారు. భోలేబాబా కంపెనీ నుంచి రూ.75లక్షలు, ప్రీమియర్ నుంచి రూ.8L, అల్ఫా నుంచి 8 గ్రా. గోల్డ్ తీసుకున్నట్లు సిట్ గుర్తించిందన్నారు. దీంతో కోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది.
News January 9, 2026
పెద్దల పడక గది ఏ దిక్కున ఉండాలి?

ఇంటి పెద్దల పడకగది నైరుతి, వాయువ్య మూలల్లో ఉంటే మంచిదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. దక్షిణ, పడమర దిశలు కలిసే నైరుతి గది కుటుంబ యజమానికి అత్యంత సౌకర్యాన్ని, ప్రశాంతతను ఇస్తుందంటున్నారు. ‘ఈ దిశలో గాలి, వెలుతురు బాగా వస్తుంది. గాఢ నిద్రతో ఆరోగ్యం బాగుంటుంది. బాధ్యత గల పెద్దలకు ఈ దిశ చాలా అనుకూలం. ఇంటి అభివృద్ధిని కోరేవారు యజమానికై నైరుతి దిశ కేటాయించాలి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 9, 2026
ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 2 వరకు పార్లమెంట్ సెషన్స్ నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 13న తొలి విడత ముగుస్తుందని, ఆ తర్వాత మార్చి 9కి పార్లమెంట్ తిరిగి సమావేశం అవుతుందని వివరించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.


