News September 14, 2024

భారత జట్టుకు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వార్నింగ్

image

పాకిస్థాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పర్యటన ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ అంశాలతో క్రికెట్‌కు అంతరాయం కలగకూడదన్నారు. టీమ్ ఇండియా తమ దేశంలో పర్యటించకపోతే, భవిష్యత్తులో పాక్ జట్టు ఏ టోర్నీ కోసం ఆ దేశానికి వెళ్లదన్నారు. 2008 తర్వాత నుంచి ఇప్పటి వరకు భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించలేదు. ఇరు జట్లు ICC టోర్నీలోనే పోటీ పడ్డాయి.

Similar News

News December 30, 2025

డైలీ 4వేల అడుగులు వేస్తే మరణ ముప్పు తగ్గినట్లే: అధ్యయనం

image

యువకుల్లా వృద్ధులూ రోజూ 10 వేల అడుగులు నడవాల్సిన అవసరం లేదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 72 ఏళ్ల వృద్ధ మహిళలపై 11 ఏళ్ల పాటు జరిపిన పరిశోధనలో.. వారానికి కేవలం 1-2 రోజులు 4,000 అడుగులు నడిచినా గుండె జబ్బులు, మరణాల ముప్పు గణనీయంగా తగ్గుతుందని తేలింది. మెట్లు ఎక్కడం, భోజనం తర్వాత నడక వంటి చిన్న చిన్న మార్పులతో ఈ లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. SHARE IT

News December 30, 2025

రేపు బయటికి రావద్దు!

image

ఇందుకు 2 కారణాలున్నాయి. ఒకటి తెలుగు రాష్ట్రాల్లో రేపు చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఉదయం, రాత్రివేళల్లో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పింది. ఇక 31st కావడంతో పార్టీలు చేసుకునేవారూ ఇళ్లలోనే ఉండటం బెటర్. రేపు HYDతో పాటు అన్ని నగరాలు, పట్టణాల్లో పోలీసులు పెద్దఎత్తున డ్రంకెన్ డ్రైవ్ చేపట్టనున్నారు. మద్యం సేవించినవారు వాహనాలపై బయటికి రావద్దని సూచిస్తున్నారు.

News December 30, 2025

పడిపోయిన ద్రవ్యోల్బణం.. ఇరాన్‌లో ఆందోళనలు

image

ఇరాన్‌ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ కరెన్సీ దారుణంగా పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే ఏకంగా 1.38 మిలియన్లకు దిగజారిపోయింది. అణు ఆంక్షల వల్ల ఇరాన్‌ పరిస్థితి అతలాకుతలం అయ్యింది. కరెన్సీ పడిపోవడంతో ద్రవ్యోల్బణం 42.2%కి చేరింది. ఆహార పదార్థాల ధరలు 72% పెరిగాయి. దీంతో టెహ్రాన్‌, ఇస్ఫహాన్, షిరాజ్, మష్హద్‌ సిటీల్లో జనం నిరసనబాట పట్టారు. సెంట్రల్ బ్యాంక్ చీఫ్ మహ్మద్ రెజా రాజీనామా చేశారు.