News March 31, 2025
‘నోబెల్’కు పాక్ మాజీ PM ఇమ్రాన్ నామినేషన్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోమారు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. పాకిస్థాన్ వరల్డ్ అలయెన్స్(PWA) ఈ నామినేషన్ వేసింది. పాక్లో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల రక్షణలో ఆయన ఎనలేని సేవ చేశారంటూ ఈ సందర్భంగా కొనియాడింది. గతంలో భారత పైలట్ అభినందన్ను విడుదల చేసినందుకు గాను ఇమ్రాన్ ఖాన్ను నోబెల్కు నామినేట్ చేస్తూ పాక్ పార్లమెంటు తీర్మానం చేసింది. ప్రస్తుతం ఇమ్రాన్ పాక్ జైల్లో ఉన్నారు.
Similar News
News February 8, 2026
SECLలో 66 పోస్టులు.. అప్లై చేశారా?

సౌత్ ఈస్ట్రన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్(<
News February 8, 2026
జీడిమామిడిలో ‘టీ దోమ’ ఉద్ధృతి వల్ల నష్టాలు

జీడిమామిడి తోటల్లో ఈ సమయంలో ‘టీ దోమల’ ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. ఇవి లేత చిగుళ్లు, పూత, పూత కాడలు, చిన్న కాయలను ఆశించి రసం పీలుస్తాయి. ఇవి ఒక రకమైన పదార్థాన్ని వదలడం వల్ల కాయలపై, చిగుర్లపై గజ్జి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ దోమల నివారణకు పూత మొదలై పువ్వు విచ్చుకోక ముందు ఒకసారి, పూలు ఫలదీకరణ చెందిన తర్వాత రెండోసారి, కాయ గోళీ సైజులో ఉన్నప్పుడు మూడోసారి మందులను పిచికారీ చేయాలి.
News February 8, 2026
పన్నులు కట్టినంత మాత్రాన యజమానులు కారు: HC

AP: ప్రభుత్వ భూమిలో చట్టబద్ధ యాజమాన్య పత్రాలు లేకుండా ఎంతకాలం నివసించినా వారు ఆక్రమణదారులేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీర్ఘకాలంగా నివాసం ఉండి పన్నులు చెల్లిస్తున్నప్పటికీ వారికి యాజమాన్య హక్కులు రావని తేల్చి చెప్పింది. ఓనర్షిప్ డాక్యుమెంట్స్ ఉన్నవారికే 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం వర్తిస్తుందని పేర్కొంది. విజయవాడ రైల్వే ఓవర్ బ్రిడ్జి భూసేకరణ కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.


