News October 11, 2024

పాకిస్థాన్ సెలక్షన్ బోర్డులోకి మాజీ అంపైర్!

image

సొంత గడ్డపై వరుసగా మ్యాచులు ఓడిపోతుండటంతో పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెలక్షన్ బోర్డులోకి మాజీ అంపైర్ అలీమ్ దార్‌ను పీసీబీ చేర్చుకున్నట్లు సమాచారం. ఆయనతోపాటు మరో నలుగురిని కూడా నియమించినట్లు తెలుస్తోంది. అఖీబ్ జావెద్, అసద్ షఫీఖ్, అజహర్ అలీ, హసన్ చీమాలను తీసుకున్నట్లు టాక్. కాగా అలీమ్ దార్ ఇటీవల అంపైరింగ్‌కు వీడ్కోలు పలికారు.

Similar News

News October 11, 2024

ఆ మ్యాచ్‌కి భారత జట్టు కెప్టెన్ ఎవరు?

image

ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్‌లో మొద‌టి రెండు మ్యాచ్‌ల‌లో ఒక‌దానికి కెప్టెన్ <<14326057>>రోహిత్ శ‌ర్మ గైర్హాజ‌ర‌య్యే<<>> అవ‌కాశం ఉండ‌డంతో ఆ మ్యాచ్‌కి సారథ్యం వ‌హించేది ఎవ‌ర‌న్న దానిపై ఆస‌క్తి నెల‌కొంది. బుమ్రా, కేఎల్ రాహుల్, శుభ్‌మ‌న్ గిల్‌, రిష‌భ్ పంత్‌ల‌లో ఒకరికి కెప్టెన్‌గా ఛాన్స్ ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. AUS లాంటి బలమైన జట్టుతో మ్యాచ్ కాబట్టి మళ్లీ కోహ్లీకి పగ్గాలు ఇచ్చే అవకాశం లేకపోలేదు.

News October 11, 2024

ఇందిరమ్మ ఇళ్ల కమిటీలపై జీవో జారీ

image

TG: పంచాయతీ, మున్సిపల్, వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను శనివారం నాటికి ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామస్థాయిలో సర్పంచి లేదా ప్రత్యేక అధికారి, మున్సిపాలిటీ స్థాయిలో కౌన్సిలర్/ కార్పొరేటర్ ఛైర్మన్‌గా కమిటీలను ఏర్పాటు చేయాలంది. పంచాయతీ కార్యదర్శి/ వార్డు ఆఫీసర్ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారని GOలో పేర్కొంది. SHG గ్రూపు సభ్యులు, ముగ్గురు స్థానికులు కమిటీలో ఉంటారు.

News October 11, 2024

ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తు గడువు

image

AP: రాష్ట్రంలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల గడువు నేటితో ముగిసింది. ఇప్పటివరకు మొత్తం 90 వేలకుపైగా అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. దరఖాస్తుల ద్వారా రూ.1,800 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. ఈ నెల 14న లాటరీ తీసి విజేతలను నిర్ణయిస్తారు. 15నాటికి దుకాణాన్ని వారికి అప్పగిస్తారు. 16 నుంచి నూతన మద్యం విధానం అమలులోకి వస్తుంది. కాగా రాష్ట్రంలో 3,396 వైన్ షాపులు ఉన్నాయి.