News September 21, 2024
రేపు జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే

AP: ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేనలో చేరనున్నారు. రేపు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు గుంటూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు కూడా జనసేనలో జాయిన్ కానున్నారు. కిలారి రోశయ్య 2019లో పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
Similar News
News November 18, 2025
హిడ్మా మృతితో అడవిలో పోరాటం అంతం!

హిడ్మా 200మంది మావోయిస్టులతో సరెండర్ అయ్యేందుకు సన్నద్ధం అవుతున్నారని నెల క్రితం వార్తలు వచ్చాయి. అయితే అతడు ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో ఉన్నాడనే సమాచారంతో ఈ ఉదయం పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఎదురుకాల్పుల్లో హిడ్మా సహా ఆరుగురు మావోలు చనిపోయారు. గతంలో హిడ్మా.. భద్రన్న, నంబాల, చలపతి వంటి అగ్ర నేతలతో ఎన్నో దాడులకు వ్యూహరచన చేశాడు. హిడ్మా మృతితో అడవిలో పోరాటం దాదాపు అంతం అయినట్లేనని సమాచారం.
News November 18, 2025
హిడ్మా మృతితో అడవిలో పోరాటం అంతం!

హిడ్మా 200మంది మావోయిస్టులతో సరెండర్ అయ్యేందుకు సన్నద్ధం అవుతున్నారని నెల క్రితం వార్తలు వచ్చాయి. అయితే అతడు ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో ఉన్నాడనే సమాచారంతో ఈ ఉదయం పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఎదురుకాల్పుల్లో హిడ్మా సహా ఆరుగురు మావోలు చనిపోయారు. గతంలో హిడ్మా.. భద్రన్న, నంబాల, చలపతి వంటి అగ్ర నేతలతో ఎన్నో దాడులకు వ్యూహరచన చేశాడు. హిడ్మా మృతితో అడవిలో పోరాటం దాదాపు అంతం అయినట్లేనని సమాచారం.
News November 18, 2025
ENCOUNTER: హిడ్మా సతీమణి రాజే సైతం మృతి

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా, అతని భార్య రాజే అలియాస్ రాజక్క సహా ఆరుగురు మావోలు హతమయ్యారు. మృతి చెందిన వారిలో స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్, మల్లా, దేవే ఉన్నారు. కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోందని AP DGP హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. డివిజన్ కమిటీ మెంబర్గా ఉన్న రాజేపై రూ.50 లక్షల రివార్డు ఉంది.


