News September 21, 2024
రేపు జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే
AP: ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేనలో చేరనున్నారు. రేపు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు గుంటూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు కూడా జనసేనలో జాయిన్ కానున్నారు. కిలారి రోశయ్య 2019లో పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
Similar News
News September 21, 2024
ఈ 7 అలవాట్లతో పిల్లల ఆరోగ్యానికి ముప్పు
కొన్ని అలవాట్లు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అవి 1.గోర్లు కొరకడం. దీని వల్ల బ్యాక్టీరియా కడుపులోకి వెళుతుంది. 2.తినేటప్పుడు TV/ఫోన్ చూడటం. 3.ఎక్కువగా హెడ్ఫోన్స్ వాడటం. 4.నిద్రపోయే ముందు ఫోన్ చూడటం. 5.బెడ్పై పడుకొని తినడం. ఇలా తింటే జీర్ణక్రియ సరిగా జరగదు. 6.పళ్లు కొరకడం. దీని వల్ల సెన్సిటివిటీ, దవడ నొప్పి వస్తుంది. 7.పికీ ఈటింగ్. దీని వల్ల పోషకాలున్న ఆహారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
News September 21, 2024
ప్రకాశ్ రాజ్కు మంచు విష్ణు కౌంటర్!
లడ్డూ విషయంలో ఏపీ డిప్యూటీ <<14151603>>సీఎం పవన్ కళ్యాణ్పై ప్రకాశ్ రాజ్ విమర్శలు <<>>చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. ‘ప్రకాశ్ రాజ్ గారూ. తిరుమల లడ్డూ అంటే కేవలం ప్రసాదం కాదు. నాలాంటి కోట్లాదిమంది హిందువులకు ఓ నమ్మకం. దర్యాప్తు జరగాలంటూ పవన్ కళ్యాణ్ కరెక్ట్గా మాట్లాడారు. మతకల్లోలాల రంగు ఎవరు ఎక్కడ పులుముతున్నారో మీరు ఒకసారి ఆలోచించుకుంటే మంచిదేమో’ అని సూచించారు.
News September 21, 2024
భారీగా పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.820 పెరిగి రూ.75,930కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి రూ.750 పెరిగి రూ.69,600 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.500 పెరిగి ప్రస్తుతం రూ.98,000కి చేరింది.