News September 21, 2024
పవన్ను కలిసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి
AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిశారు. రేపు జనసేనలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. రోశయ్యతోపాటు ఆయన వియ్యంకుడు రవిశంకర్ కూడా ఆ పార్టీలో చేరుతున్నారు. కాగా రోశయ్య ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. 2019లో పొన్నూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతిలో ఓటమిపాలయ్యారు.
Similar News
News September 21, 2024
ఆ వివాదంలోకి కెనీషాను లాగొద్దు: జయం రవి
తమిళ నటుడు జయం రవి తన భార్యతో విడిపోవడం వెనుక గాయని కెనీషా ఫ్రాన్సిస్తో ఉన్న సంబంధమే కారణమని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రవి తాజాగా స్పందించారు. ‘దయచేసి ఇందులోకి ఎవరి పేరునూ లాగొద్దు. వ్యక్తిగత జీవితాల్ని గౌరవించండి. చాలామంది చాలా అంటున్నారు. కెనీషా 600కు పైగా స్టేజీ షోల్లో పాడిన గాయని. కష్టపడి పైకొచ్చింది. ఆమెను ఈ వివాదంలో దయచేసి ఇన్వాల్వ్ చేయకండి’ అని విజ్ఞప్తి చేశారు.
News September 21, 2024
ఇగ్నో అడ్మిషన్ల గడువు పొడిగింపు
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జులై 2024 సెషన్కు సంబంధించి అన్ని ఆన్లైన్, ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) ప్రోగ్రామ్ల కోసం అడ్మిషన్ల గడువును పొడిగించింది. తాజాగా Sep 30, 2024 వరకు గడువు పెంచింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక పోర్టల్స్ ద్వారా అండర్ గ్రాడ్యుయేట్, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో రెండుసార్లు అడ్మిషన్ల గడువు పెంచారు.
News September 21, 2024
బాబు, లోకేశ్ ప్రమాణానికి సిద్ధమా?: అంబటి
AP: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు నిరూపించలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ వ్యవహారంపై తిరుమలలో చంద్రబాబు, లోకేశ్కు ప్రమాణం చేసే ధైర్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ‘రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల శ్రీవారిని ఉపయోగించుకుంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 18 సార్లు నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపాం. కల్తీ నెయ్యి చంద్రబాబు హయాంలోనే వచ్చింది’ అని అంబటి ఆరోపించారు.