News December 24, 2024
ఫార్ములా ఈ-రేసు కేసు.. 2 రోజుల్లో నిందితులకు నోటీసులు!

TG: ఫార్ములా ఈ-రేసు కేసుపై ఈడీ అధికారులు కూడా విచారణ ప్రారంభించారు. రెండు రోజుల్లో నిందితులకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. రేసుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను పరిశీలించిన అధికారులు, నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. HMDAకు చెందిన మరిన్ని పత్రాలను కూడా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్న సంగతి తెలిసిందే.
Similar News
News April 19, 2026
పుష్ప-2 రికార్డు బ్రేక్ చేసిన ధురంధర్-2

రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్-2 సినిమా మరో మైలురాయిని దాటేసింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ చిత్రాల జాబితాలో పుష్ప-2(₹1,742Cr)ను బీట్ చేసింది. ₹1748Cr కలెక్షన్లతో మూడో స్థానానికి చేరింది. తొలి రెండు స్థానాల్లో దంగల్(₹2,090Cr), బాహుబలి:2(₹1,788Cr) ఉన్నాయి. కాగా ఇప్పటికే ₹3,000+Cr గ్రాస్ వసూళ్లు రాబట్టిన తొలి భారతీయ ఫ్రాంచైజీగా ‘ధురంధర్’ రికార్డులకెక్కిన విషయం తెలిసిందే.
News April 19, 2026
ఏపీ విభజన వ్యాఖ్యల వివాదం.. తేజస్వీ సూర్య ఏమన్నారంటే?

తెలంగాణను ఉద్దేశించి లోక్సభలో తాను చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడంపై BJP MP తేజస్వీ సూర్య స్పందించారు. ‘కాంగ్రెస్ నిరక్షరాస్యుల పార్టీ. నేనేం మాట్లాడానో ఆ పార్టీ నేతలు మళ్లీ వినండి. ఆ సింపుల్ మాటలను వీలైతే అర్థం చేసుకోండి. INC లీడర్లు ఉద్దేశపూర్వకంగా, అజ్ఞానంతో నిరసన తెలుపుతున్నారు’ అని మీడియాతో వ్యాఖ్యానించారు. ఉమ్మడి APని IND, PAK తరహాలో విభజించారని తేజస్వీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
News April 19, 2026
కాసేపట్లో వర్షం..

TG: సిరిసిల్ల, జగిత్యాల, సంగారెడ్డి జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. అలాగే వికారాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో సాయంత్రం వానలు పడతాయని చెప్పారు. ఇక హైదరాబాద్లో సాయంత్రం లేదా రాత్రి వర్షం పడొచ్చని పేర్కొన్నారు. అటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు.


