News October 23, 2025
రాజధానిలో 12 బ్యాంకులకు 28న శంకుస్థాపన

AP: అమరావతిలో 12 ప్రముఖ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు ఈ నెల 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పాల్గొననున్నారు. ఉద్దండరాయునిపాలెం వద్ద ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. SBI, కెనరా, యూనియన్ బ్యాంక్, BOB, ఇండియన్ బ్యాంక్, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్, PNB, BOI, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు కానున్నాయి.
Similar News
News October 23, 2025
భారత్ బ్యాటింగ్.. టీమ్స్ ఇవే

టీమ్ ఇండియాతో రెండో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
భారత్: రోహిత్ శర్మ, గిల్ (C), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: హెడ్, మార్ష్(C), షార్ట్, రెన్షా, కారే, కొన్నోలీ, ఓవెన్, బార్ట్లెట్, స్టార్క్, జంపా, హేజిల్వుడ్.
News October 23, 2025
ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్?

బిహార్ మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని ఆర్జేడీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఆ కూటమిలో సీట్ల పంపకాల వివాదం సద్దుమణిగినట్లు తెలుస్తోంది.
News October 23, 2025
RBI వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 880 టన్నుల రిజర్వులు ఉన్నట్లు RBI తాజా డేటా వెల్లడించింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఇది $95 బిలియన్ (రూ.8.36 లక్షల కోట్లు)తో సమానం. 2025-26 FY తొలి 6 నెలల్లోనే 600 కేజీలను కొనుగోలు చేసింది. అంతర్జాతీయంగా ఆర్థిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని ఆర్బీఐ వెల్లడించింది.


