News September 14, 2025

ఒకే కాన్పులో నలుగురు బిడ్డలు… మొత్తం ఏడుగురు..

image

మహారాష్ట్రలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురికి(క్వాడ్రాప్లెట్స్) జన్మనిచ్చింది. పుణే జిల్లాలోని సస్వద్‌కు చెందిన 27 ఏళ్ల మహిళ సతారా ఆస్పత్రిలో పురిటినొప్పులతో చేరారు. అక్కడ వైద్యులు ఆమెకు కాన్పు చేయగా ఓ మగ, ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఒకే కాన్పులో నలుగురు పుట్టడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. కాగా ఆ మహిళకు గతంలోనూ ట్విన్స్ పుట్టారు. మరో బాలుడు కూడా ఉన్నారు. మొత్తం ఏడుగురికి ఆమె జన్మనిచ్చింది.

Similar News

News January 18, 2026

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. మరికొన్ని చోట్ల రూ.300పైనే కొనసాగుతున్నాయి. HYDలో కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.300-320గా ఉంది. గుంటూరు, విశాఖలో రూ.300, నంద్యాల రూ.260-300, కామారెడ్డిలో రూ.300-310, కర్నూలులో రూ.310-320కి విక్రయిస్తున్నారు. అమలాపురంలో రూ.250 నుంచి రూ.300కి పెరిగింది. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News January 18, 2026

మీ ఇంట్లో సూర్యుడి విగ్రహం ఉందా?

image

చాలామంది ఇళ్లల్లో దేవుళ్ల విగ్రహాలు ఉంటాయి. కానీ సూర్యుడి విగ్రహాన్ని మాత్రం పెట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే సూర్యుడు మనకు రోజూ ప్రత్యక్ష దైవంగా కనిపిస్తాడు. ఉదయాన్నే సూర్యోదయ సమయంలో ఆ భాస్కరుడిని చూస్తూ నమస్కరించుకోవడం, అర్ఘ్యం వదలడం శ్రేష్ఠం. ప్రకృతిలోనే దైవాన్ని దర్శించుకునే అవకాశం ఉన్నప్పుడు, విగ్రహ రూపం కంటే నేరుగా సూర్యుడిని ఆరాధించడమే అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది.

News January 18, 2026

బిడ్డ ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే?

image

ప్రెగ్నెన్సీలో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి పీచు ఎక్కువగా ఉండే పప్పులు, బీన్స్‌, బఠానీ, బెర్రీ పండ్లు, నట్స్‌, డ్రైఫ్రూట్స్‌తీసుకోవాలి. కాల్షియం కోసం పాలు, పాల పదార్థాలు, ఆకుకూరలు, గుడ్లు, సపోటా, చేపలు తీసుకోవాలి. ఐరన్ లోపం రాకుండా ఆప్రికాట్స్‌, కోడిగుడ్లలోని పచ్చసొన, చేపలు, డ్రైఫ్రూట్స్‌, ఆకుకూరలు, ఆకుపచ్చటి కాయగూరలు, ఓట్స్‌, చిరుధాన్యాలు, గోధుమలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.