News January 12, 2025

ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టుల మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. మద్దేడు పీఎస్ పరిధిలో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు లభించాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 30, 2025

జేజమ్మగా శ్రీలీల.. నిర్మాతగా అల్లు అరవింద్?

image

అనుష్క నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘అరుంధతి’ 16 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లో రీమేక్ కానున్నట్లు సమాచారం. ఇందులో జేజమ్మగా శ్రీలీల నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తారని, ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయని టాక్. తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

News October 30, 2025

జగన్ ఫోన్ నంబర్ పిటిషన్ కొట్టివేత

image

AP మాజీ CM జగన్ లండన్ పర్యటన సందర్భంగా వేరే ఫోన్ నంబర్ ఇచ్చారంటూ CBI దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టేసింది. విదేశీ పర్యటనలో అందుబాటులో ఉన్నారా లేదా? మాత్రమే చూడాలంది. ఆయన పర్యటన నుంచి తిరిగొచ్చినందున CBI పిటిషన్‌కు కాలం చెల్లిందని పేర్కొంది. జగన్ ఎప్పుడు స్వదేశానికి వచ్చారో వివరాలతో మెమో దాఖలు చేయాలంది. పెద్ద కుమార్తెను చూసేందుకు OCT 11న జగన్ లండన్ వెళ్లిన విషయం తెలిసిందే.

News October 30, 2025

జీవ ముక్తికి మార్గం ఈ కార్తీక మాసం

image

ఈ పవిత్ర మాసంలో కార్తీక వ్రతం ఆచరించేవారు జీవన్ముక్తులు అవుతారు. స్త్రీ, పురుష, వయో భేదం లేకుండా ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలా చేయనివారు ‘అంధతామిత్రము’ అనే నరకాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో కావేరీ నదీ స్నానం, దీపారాధన, దీపదానం చేయడం పుణ్యప్రదం. ధన-ధాన్య-ఫల దానాలు కూడా అమిత ఫలదాయకాలు. ఈ 30 రోజులు కార్తీక మహాత్మ్యాన్ని చదివినా, విన్నా జీవన్ముక్తి లభిస్తుంది. <<-se>>#Karthikam<<>>