News March 17, 2024
కాంగ్రెస్లోకి మరో నలుగురు BRS MLAలు?
TG: కాంగ్రెస్లో చేరికలకు గేట్లు ఓపెన్ చేశానన్న CM రేవంత్ వ్యాఖ్యలతో BRS శ్రేణుల్లో గుబులు మొదలైంది. ఇవాళ చేవెళ్ల MP రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరారు. రెండు రోజుల్లో మరో నలుగురు BRS MLAలు కాంగ్రెస్లో చేరతారని సమాచారం. ఇటీవల CMను MLAలు ప్రకాశ్ గౌడ్, యాదయ్య, సునీతా లక్ష్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మహిపాల్, తెల్లం వెంకట్రావు తదితరులు కలిసిన విషయం తెలిసిందే.
Similar News
News July 3, 2024
రేపు స్వదేశానికి భారత జట్టు!
హరికేన్ కారణంగా బార్బడోస్లోనే చిక్కుకుపోయిన భారత జట్టు మరికొన్ని గంటల్లో స్వదేశానికి బయలుదేరనుంది. ఆటగాళ్లు, సిబ్బంది కోసం BCCI ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్లు జాతీయ మీడియా ప్రతినిధులు వెల్లడించారు. వీరితో 20మందికిపైగా మీడియా సిబ్బంది వచ్చేందుకు BCCI సెక్రటరీ జైషా అనుమతించారని చెప్పారు. ఈ క్రమంలో మీడియా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా రేపు ఉదయం కల్లా విమానం ఢిల్లీ చేరే అవకాశముంది.
News July 3, 2024
సరికొత్త రికార్డ్.. సెన్సెక్స్@80,000
దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేశాయి. 560 పాయింట్లకుపైగా లాభపడిన సెన్సెక్స్ తొలిసారిగా 80వేల మార్క్ తాకింది. మరోవైపు నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 24,277 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో దూసుకెళ్లడం మార్కెట్లకు కలిసొచ్చింది. HDFC, యాక్సిస్, ICICI, కోటక్ బ్యాంకుల షేర్లు నిఫ్టీ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఐటీ మినహా ఇతర ప్రధాన రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
News July 3, 2024
మహేశ్ మూవీలో విలన్గా మలయాళ హీరో?
మహేశ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘SSMB29’ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తారని సమాచారం. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సలార్ సినిమాలో వరదరాజ మన్నార్గా పృథ్వీరాజ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.