News June 5, 2024
25ఏళ్లకే నలుగురు ఎంపీలుగా ఎన్నిక

ఈ లోక్సభ ఎన్నికల్లో నలుగురు ఎంపీలు 25ఏళ్లకే పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు. ఇందులో శాంభవి చౌదరీ సమస్తిపుర్ నియోజకవర్గం నుంచి LJP అభ్యర్థిగా గెలుపొందగా, మరొకరు రాజస్థాన్లోని భరత్పుర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సంజనా జాతవ్, ఎస్పీ అభ్యర్థి పుష్పేంద్ర సరోజ్ కౌశంబి పార్లమెంట్ స్థానంలో గెలుపొందారు. ప్రియా సరోజ్ మచ్లిషహర్ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా గెలుపొందారు.
Similar News
News November 24, 2025
శరణు ఘోషతోనే కొండ ఎక్కుతారు

శబరి యాత్రలో ఎత్తైన, నిట్టనిలువు కొండ ‘కరిమల’. సుమారు 10KM ఎత్తుకు వెళ్లిన తర్వాత భక్తులు దీని శిఖరాన్ని చేరుకుంటారు. ఇక్కడ అతి ప్రాచీనమైన బావి, జలపాతం ఉన్నాయి. భక్తులు ఇక్కడ దాహార్తిని తీర్చుకుంటారు. ఇంత ఎత్తులో జలపాతం ఉండటం దీని ప్రత్యేకత. ఈ కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే శరణు ఘోష ముందు ఈ కష్టం దూది పింజెలా తేలిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>
News November 24, 2025
IIT ధన్బాద్ 105 పోస్టులకు నోటిఫికేషన్

<
News November 24, 2025
జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. జీవో నం.46 ప్రకారం 50% క్యాప్తో రిజర్వు స్థానాలు ఖరారు చేస్తూ కాసేపటి క్రితం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇందులో SC, STల పంచాయతీలు యథాతథంగా ఉండగా 22% రిజర్వేషన్ మాత్రమే అమలు చేస్తుండటంతో పలుచోట్ల BCల రిజర్వు స్థానాలు మారాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సైతం ఈ వివరాలు పంపింది.


