News June 5, 2024

25ఏళ్లకే నలుగురు ఎంపీలుగా ఎన్నిక

image

ఈ లోక్‌సభ ఎన్నికల్లో నలుగురు ఎంపీలు 25ఏళ్లకే పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు. ఇందులో శాంభవి చౌదరీ సమస్తిపుర్ నియోజకవర్గం నుంచి LJP అభ్యర్థిగా గెలుపొందగా, మరొకరు రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సంజనా జాతవ్, ఎస్పీ అభ్యర్థి పుష్పేంద్ర సరోజ్ కౌశంబి పార్లమెంట్ స్థానంలో గెలుపొందారు. ప్రియా సరోజ్ మచ్లిషహర్ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా గెలుపొందారు.

Similar News

News November 16, 2025

టెస్టుకు దూరమైన గిల్

image

టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దీంతో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన పాల్గొనరని BCCI వెల్లడించింది. రెండో రోజు బ్యాటింగ్ చేస్తూ గిల్ మెడనొప్పితో మైదానాన్ని వీడారు. అటు ఇవాళ మూడో రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్సులో సౌతాఫ్రికా స్కోర్ 93/7గా ఉంది.

News November 16, 2025

తిరుమలలో ఈ ఆలయాన్ని దర్శించుకున్నారా?

image

స్వామివారి పుష్కరిణికి వాయువ్యంలో ఉన్న వరాహస్వామి ఆలయాన్ని తప్పక దర్శించుకోవాలి. పురాణాల ప్రకారం.. విష్ణుమూర్తి వరాహావతారంలో భూమిని పైకెత్తారు. ఆయన అనుమతితోనే శ్రీనివాసుడు తిరుమలలో వెలిశారు. అందుకే, తిరుమలలో తనను దర్శించుకునే భక్తులందరూ ముందుగా భూవరాహస్వామిని దర్శించుకుంటారని శ్రీనివాసుడు చెప్పారు. ఇప్పటికీ శ్రీవారి దర్శనానికన్నా ముందు దర్శనం, నైవేద్యం వరాహస్వామికే సమర్పిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 16, 2025

134 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

భారత వాతావరణ శాఖ(IMD) 134 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MSc, BE, B.Tech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. PhD, ME, M.Tech కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. * మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.