News April 12, 2025
టీపీసీసీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు?

TG: TPCCకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. BC సామాజిక వర్గ నేత మహేశ్ కుమార్ గౌడ్ ఇప్పటికే పీసీసీ చీఫ్గా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన నలుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అవకాశాన్ని కల్పించే దిశగా కాంగ్రెస్ చూస్తున్నట్లు సమాచారం. మొత్తంగా పీసీసీని పూర్తిస్థాయిలో విస్తరించొచ్చని గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి.
Similar News
News December 23, 2025
ఎంపీ, ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారు: కేంద్ర మంత్రి

ప్రతి MP, MLA అభివృద్ధి నిధుల్లో కమీషన్ తీసుకుంటున్నారని కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాఝీ వ్యాఖ్యానించారు. ‘నేను కూడా కమీషన్ తీసుకున్నాను. దాన్ని పార్టీకి ఇచ్చేవాడిని. మీరు కనీసం 5% కమీషన్ అయినా తీసుకోవాలి’ అని HAM(S) పార్టీ మీటింగ్లో నేతలకు సూచించారు. MPకి ₹5CR వరకు అభివృద్ధి నిధి ఉంటుందని, 10% కమీషన్ తీసుకున్నా ₹40 లక్షలకు పైనే వస్తుందని అన్నారు. కాగా మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
News December 23, 2025
జనవరి 1 నుంచి భీమాశంకర్ టెంపుల్ క్లోజ్

జ్యోతిర్లింగాల్లో ఒకటైన భీమాశంకర్ ఆలయం(MH) 2026 JAN 1 నుంచి మూతపడనుంది. ఆలయ అభివృద్ధి ప్లాన్లో భాగంగా ప్రధాన ఆలయ సభా మండపాన్ని రెనోవేట్ చేయనున్నారు. నిర్మాణ పనులు జరిగే టైంలో భక్తుల సేఫ్టీ దృష్ట్యా ఆలయంలో దర్శనాలను 3 నెలలపాటు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. సహ్యాద్రి పర్వత శ్రేణిలోని ఈ టెంపుల్ ఆధ్యాత్మిక ప్రేమికులకు మాత్రమే కాదు నేచర్ లవర్స్, ట్రెక్కింగ్ చేసే వారికీ ఫేవరెట్ స్పాట్గా ఉంది.
News December 23, 2025
అప్పు చేసి మరీ ఎంజాయ్ చేస్తున్న మన కుర్రకారు.. మరి చైనాలో?

భారత యువత అవసరం కోసమో, ఆస్తుల కోసమో కాకుండా.. ఎంజాయ్ చేయడానికే అప్పులు చేస్తున్నారట. ఈ ఏడాదిలో మన కుర్రకారు తీసుకున్న పర్సనల్ లోన్లలో 27% టూర్ల కోసమేనని తేలినట్లు ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా తెలిపారు. మరోవైపు చైనా యువత మాత్రం బంగారం కొంటూ భవిష్యత్తు కోసం జాగ్రత్త పడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మనవాళ్లేమో రేపటి సంపాదనపై ధీమాతో నేడు అప్పు చేసి మరీ ఖర్చు చేస్తున్నారు.


