News April 12, 2025
టీపీసీసీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు?

TG: TPCCకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. BC సామాజిక వర్గ నేత మహేశ్ కుమార్ గౌడ్ ఇప్పటికే పీసీసీ చీఫ్గా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన నలుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అవకాశాన్ని కల్పించే దిశగా కాంగ్రెస్ చూస్తున్నట్లు సమాచారం. మొత్తంగా పీసీసీని పూర్తిస్థాయిలో విస్తరించొచ్చని గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి.
Similar News
News December 29, 2025
ఆ దేశాలతో పూర్తి స్థాయి యుద్ధం: ఇరాన్

అమెరికా, ఇజ్రాయెల్, యూరప్తో తాము పూర్తి స్థాయి యుద్ధంలో ఉన్నామని ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ ప్రకటించారు. ఇరాన్ సొంత కాళ్లపై నిలబడటం పశ్చిమ దేశాలకు ఇష్టం లేదని, తమను మోకరిల్లేలా చేయాలని అనుకుంటున్నాయని చెప్పారు. ‘ఇది మనపై ఇరాక్ చేసిన యుద్ధం కంటే దారుణమైనది. చాలా క్లిష్టమైనది. అన్నివైపుల నుంచి ముట్టడిస్తున్నారు. జీవనోపాధి, భద్రతాపరంగా సమస్యలు సృష్టిస్తున్నారు’ అని అన్నారు.
News December 29, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 29, 2025
‘OP సిందూర్’లో మా ఎయిర్బేస్పై దాడి జరిగింది: పాక్ Dy PM

ఆపరేషన్ సిందూర్ సమయంలో నూర్ ఖాన్ ఎయిర్బేస్పై దాడి జరిగిందని పాక్ Dy PM ఇషాక్ దార్ ఒప్పుకున్నారు. కానీ ఇండియా దాడిని సమర్థంగా అడ్డుకున్నట్లు గొప్పలకుపోయారు. ‘వాళ్లు(ఇండియా) మా పైకి 36 గంటల్లో 80 డ్రోన్లు పంపారు. మేం 79 ఇంటర్సెప్ట్ చేశాం. ఒకటి మాత్రం మా సైనిక స్థావరాన్ని డ్యామేజ్ చేసింది. మే 10న నూర్ ఖాన్ బేస్పై దాడితో ఇండియా తప్పు చేసింది. దీంతో పాక్ ప్రతీకార చర్యకు దిగింది’ అని చెప్పారు.


