News July 13, 2024
నాలుగో టీ20: భారత్ టార్గెట్ ఎంతంటే?

భారత్తో జరుగుతున్న నాలుగో టీ20లో జింబాబ్వే 20 ఓవర్లలో 152/7 రన్స్ చేసింది. ఆ జట్టులో కెప్టెన్ సికిందర్ రజా 46 రన్స్తో రాణించారు. మారుమణి 32, మాధెవెరె 25 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. అటు భారత్ జట్టులో అరంగేట్ర బౌలర్ దేశ్పాండే ఇంటర్నేషనల్ క్రికెట్లో తొలి వికెట్ పడగొట్టారు. ఖలీల్ 2, సుందర్, అభిషేక్, దూబే తలో వికెట్ తీశారు. భారత్ విజయానికి 153 పరుగులు కావాలి.
Similar News
News December 29, 2025
2025: అత్యధిక వసూళ్ల చిత్రంగా ‘ధురంధర్’

ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రంగా రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ నిలిచింది. ఈ చిత్రం రూ.1034.8కోట్లు రాబట్టింది. IMDb ప్రకారం 2025లో బాక్సాఫీస్ను షేక్ చేసిన టాప్-10 మూవీస్ ఇవే.. ధురంధర్, కాంతార-2 (₹853.4Cr), ఛావా(₹808.7Cr), సైయారా(₹575.8Cr), కూలీ (₹516.7Cr), వార్-2 (₹360.7Cr), మహావతార్ నరసింహ (₹326.1Cr), లోక చాప్టర్-1 (₹302.1Cr), OG (₹298.1Cr), హౌజ్ఫుల్-5 (₹292.5కోట్లు)
News December 29, 2025
7 ఏళ్లకే చెస్ ఛాంపియన్.. ఈ చిన్నారి గురించి తెలుసా?

ఏడేళ్ల వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన ప్రజ్ఞిక గురించి నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. ఈ చిన్నారిని రాష్ట్రీయ బాల పురస్కార్ వరించింది. ఈ ఏడాది సెర్బియాలో జరిగిన “FIDE వరల్డ్ స్కూల్స్ చెస్ ఛాంపియన్షిప్-2025″లో U-7 బాలికల విభాగంలో స్వర్ణం సాధించింది. “నేను బెస్ట్ చెస్ ప్లేయర్ అవుతా” అని ఆమె మోదీతో చెెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఏపీకి చెందిన వీరి ఫ్యామిలీ గుజరాత్లో స్థిరపడింది.
News December 29, 2025
ఢిల్లీ హైకోర్టుకు Jr.NTR స్పెషల్ థాంక్స్

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘ఇప్పటి డిజిటల్ యుగంలో నా వ్యక్తిత్వ హక్కులను కాపాడేందుకు ప్రొటెక్టివ్ ఆర్డర్ పాస్ చేసిన ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు, వాణిజ్య అవసరాలకు అనుమతి లేకుండా తమ ఫొటోలు వాడటంపై పవన్ కళ్యాణ్, <<18640929>>Jr.NTR<<>> ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లను వేసిన విషయం తెలిసిందే.


