News July 13, 2024

నాలుగో టీ20: భారత్ టార్గెట్ ఎంతంటే?

image

భారత్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో జింబాబ్వే 20 ఓవర్లలో 152/7 రన్స్ చేసింది. ఆ జట్టులో కెప్టెన్ సికిందర్ రజా 46 రన్స్‌తో రాణించారు. మారుమణి 32, మాధెవెరె 25 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. అటు భారత్ జట్టులో అరంగేట్ర బౌలర్ దేశ్‌పాండే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తొలి వికెట్ పడగొట్టారు. ఖలీల్ 2, సుందర్, అభిషేక్, దూబే తలో వికెట్ తీశారు. భారత్ విజయానికి 153 పరుగులు కావాలి.

Similar News

News March 28, 2026

వైసీపీ గైర్హాజరు.. జగన్ మదిలో ఏముంది?

image

AP: రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై చర్చకూ వైసీపీ గైర్హాజరైంది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సహా ఎమ్మెల్యేలు ఎవరూ సభకు రాలేదు. తమ పార్టీ, జగన్ అమరావతికి వ్యతిరేకం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే పలు వేదికలపై స్పష్టం చేశారు. మరి ఇవాళ తీర్మానంపై చర్చకైనా ఆ పార్టీ ఎందుకు రాలేదనే చర్చ మొదలైంది. అమరావతికి జగన్ అనుకూలంగా లేరా? ఆయన మదిలో ఏముంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

News March 28, 2026

పార్లమెంటులో వైసీపీ ఏం చేస్తుందో చూడాలి: లోకేశ్

image

AP: రాజధానిపై అసెంబ్లీ చేసిన తీర్మానం ఈ రోజే కేంద్రానికి వెళ్తుందని మంత్రి లోకేశ్ చిట్‌చాట్‌లో తెలిపారు. ఏప్రిల్ 1న కేంద్ర క్యాబినెట్ దీనికి ఆమోదం తెలుపుతుందని, 2న పార్లమెంటులో ప్రవేశపెడతారని చెప్పారు. అసెంబ్లీకి గైర్హాజరైన వైసీపీ పార్లమెంటులో ఏం చేస్తుందో చూడాలన్నారు. జగన్ సినిమా ఏంటో గత ఎన్నికల్లో తేలిపోయిందని, ఇంకేం సినిమా చూపిస్తారని ప్రశ్నించారు.

News March 28, 2026

ఒక్కో సినిమాకు రూ.15-20 కోట్లు.. నిర్మాతల భయం!

image

‘పుష్ప’, ‘పుష్ప-2’ సినిమాలతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌కు తెలుగులో ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కానీ ఆయన ఒక్క మూవీ కూడా ఒప్పుకోలేదు. ఒక్కో చిత్రానికి రూ.15-20 కోట్ల వరకు డిమాండ్ చేయడమే దీనికి కారణమని టాలీవుడ్ వర్గాల టాక్. ఆ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు భయపడే నిర్మాతలు ముందుకు రావట్లేదని సమాచారం.