News February 25, 2025

పెట్రోల్ బంకుల్లో మోసాలు.. DGP హెచ్చరిక

image

AP: ఎలక్ట్రానిక్ చిప్‌లు టాంపర్ చేసి రాష్ట్రంలోని పలు పెట్రోల్ బంకులు మోసం చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. రాజమహేంద్రవరం, ఏలూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని 73 పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేసి పలు చోట్ల వాహనాలకు తక్కువ పెట్రోల్, డీజిల్ కొడుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని DGP హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు.

Similar News

News December 2, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 2, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 2, మంగళవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.31 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.06 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.57 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 2, 2025

రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి: YCP

image

AP: CBN ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్ మెస్ బిల్లులు చెల్లించకపోవడంతో అవి కొండల్లా పేరుకుపోతున్నాయని YCP ఆరోపించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి భారీగా నిధులు పేరుకుపోయాయని విమర్శించింది. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కింద రూ.5,600కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు రూ.2,200కోట్లు బకాయిలున్నట్లు తెలిపింది. దీంతో విద్యార్థులకు చదువుతో పాటు భోజనం కూడా దక్కని పరిస్థితి నెలకొందని ట్వీట్ చేసింది.