News July 5, 2024
క్రెడిట్ కార్డు పేరుతో మోసం.. జాగ్రత్త: TG పోలీస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720162612575-normal-WIFI.webp)
క్రెడిట్ కార్డు పేరుతో జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని TG పోలీసులు సూచిస్తున్నారు. అప్లై చేయకుండానే క్రెడిట్ కార్డు మంజూరు అయినట్లు, ఆ కార్డుతో చెల్లింపులు జరిగినట్లు సైబర్ నేరగాళ్లు ప్రజలను సంప్రదిస్తున్నారని తెలిపారు. వెంటనే డబ్బు చెల్లించకపోతే అరెస్టు అవుతారని బెదిరించి డబ్బులు కాజేస్తున్నారని పేర్కొన్నారు. తాజాగా HYDలో ఓ మహిళా ఉద్యోగి ఇదే తరహాలో మోసపోయారని ట్వీట్ చేశారు.
Similar News
News July 8, 2024
ప్రతి తిరస్కరణ ఆశీర్వాదం అని తెలుసుకుంటారు: ప్రశాంత్ వర్మ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720416120449-normal-WIFI.webp)
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అసంతృప్తితో చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ప్రతి తిరస్కరణ ఓ ఆశీర్వాదం అని మీరు ఒక రోజు తెలుసుకుంటారు’ అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఇది కచ్చితంగా బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ను ఉద్దేశించే చేశారంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ తన తదుపరి చిత్రం ‘రాక్షసుడు’ను రణ్వీర్తో తీయాలనుకోగా.. విభేదాలు రావడంతో తాజాగా క్యాన్సల్ అయిన విషయం తెలిసిందే.
News July 8, 2024
కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకానికి ప్రభుత్వ ఉత్తర్వులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92022/1662720933707-normal-WIFI.webp)
TGలో కార్పొరేషన్ల ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా విడుదలయ్యాయి. 35 మందిని నియమిస్తూ మార్చి 15నే జీవో రిలీజ్ చేయగా, ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆగిపోయాయి. విత్తనాభివృద్ధి- అన్వేష్ రెడ్డి, రాష్ట్ర సహకార సంఘం- మోహన్ రెడ్డి, కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్- జంగా రాఘవ్ రెడ్డి, ఫిషరీస్ సొసైటీస్- మెట్టు సాయి కుమార్, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్గా కాసుల బాలరాజును నియమించింది.
News July 8, 2024
అమానవీయం: ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720417339069-normal-WIFI.webp)
AP: బాపట్ల(D) చీరాల మం. కొత్తపాలెంకు చెందిన మణికంఠ రెడ్డి, కుసుమాంజలి 2021లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 20 రోజుల క్రితం భర్త ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఆ సమయంలో నిండు గర్భిణిగా ఉన్న కుసుమాంజలి వారం క్రితం ప్రసవించింది. అప్పటికే ఓ ఆడబిడ్డ ఉండగా రెండో కాన్పులో ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ముగ్గురూ ఆడపిల్లలే కావడంతో అత్తింటివారు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో కుసుమాంజలి పోలీసులను ఆశ్రయించింది.