News April 10, 2025
ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు.. ఉత్తర్వులు జారీ

AP: విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు 2025-26 విద్యాసంవత్సరానికి పేద కుటుంబాల పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించాలని పేర్కొంది. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం చేసే ఖర్చు ఆధారంగా వ్యయాన్ని అంచనా వేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. అది నిర్ణయించిన ఫీజును ప్రభుత్వమే భరించనుంది.
Similar News
News January 2, 2026
నదీ జలాల వివాద పరిష్కారానికి 3నెలల గడువు

AP, TGల మధ్య నదీ జలాల వివాదంపై ఏర్పాటు చేసిన <<18742119>>కమిటీకి<<>> కేంద్రం 3 నెలల గడువు విధించింది. నీటి నిర్వహణలో సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలని సూచించింది. అపరిష్కృత అంశాలను అధ్యయనం చేసి సమాన నీటి భాగస్వామ్యం ఉండేలా సిఫార్సులు ఇవ్వాలంది. ఈ ప్రక్రియలో సంబంధిత విభాగాలను సమావేశాలకు రప్పించవచ్చని తెలిపింది. కాగా 2025 JUL 16న 2రాష్ట్రాల CMలతో నిర్వహించిన భేటీలో కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది.
News January 2, 2026
ఇతిహాసాలు క్విజ్ – 115 సమాధానం

ఈరోజు ప్రశ్న: రావణుడిని బంధించిన వానర రాజు ఎవరు? తన శక్తితో ఆ రాజు రావణుడిని ఏం చేశాడు?
సమాధానం: రావణుడిని బంధించిన వానర రాజు వాలి. రావణుడు తనను యుద్ధానికి ఆహ్వానించినప్పుడు ధ్యానంలో ఉన్న వాలి చంకలో నొక్కి పట్టుకున్నాడు. 6 నెలల పాటు బందీగా ఉంచుకుని, 4 సముద్రాల మీదుగా ఆకాశంలో విహరించాడు. వాలి బలం ముందు రావణుడి పప్పులు ఉడకలేదు. చివరికి రావణుడు తన ఓటమిని అంగీకరించాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 2, 2026
ఈ ఏడాది అత్యధిక పెట్టుబడులు APలోనే: లోకేశ్

AP: FY2026లో దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో అత్యధికం ఆంధ్రాకే దక్కినట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. AP(25.3%) అగ్రస్థానంలో తర్వాత ఒడిశా(13.1%), మహారాష్ట్ర(12.8%), TG(9.5%) ఉన్నాయని తెలిపింది. ‘FY2026లో రాష్ట్రానికి 25.3% పెట్టబుడులు వచ్చాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే చూడటానికి ఇలాగే ఉంటుంది. పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది’ అని ట్వీట్ చేశారు.


