News March 7, 2025
టెన్త్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం

AP: రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో RTC యాజమాన్యం సిబ్బందికి పలు సూచనలు చేసింది. టెన్త్ విద్యార్థుల వద్ద బస్ పాస్ లేకపోయినా హాల్ టికెట్ చూసి పల్లె వెలుగు/ అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కించుకోవాలని ఆదేశించింది. పబ్లిక్ హాలిడే రోజుల్లోనూ పరీక్షలు ఉంటే అనుమతించాలని పేర్కొంది. ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి.
Similar News
News January 21, 2026
రాష్ట్రంలో మరో 6 అర్బన్ ఫారెస్ట్లు

తెలంగాణలో మరో 6 అర్బన్ ఫారెస్ట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ‘నగర్ వన్ యోజన’ కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా రూ.8.26 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా మావల, యాపల్ గూడ-II, మంచిర్యాల జిల్లా ఇందారం, చెన్నూర్, మేడ్చల్ జిల్లా యెల్లంపేట, చెంగిచెర్లలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పార్కుల ఏర్పాటు జరుగుతుంది.
News January 21, 2026
జనవరి 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’

AP: పర్యాటక శాఖ JAN 24-FEB 1 వరకు ‘విశాఖ ఉత్సవం’ నిర్వహించనుంది. ‘సీ టు స్కై’ కాన్సెప్ట్తో విశాఖ, అనకాపల్లి, అరకు లోయలో 9 రోజులపాటు ఉత్సవం జరగనుంది. విశాఖలో JAN 24-31 వరకు, JAN 29, 30 అనకాపల్లిలో, JAN 30-FEB 1 వరకు అరకు లోయలో ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. దీనిలో 10 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. 3000 మందికి ప్రత్యక్ష, 1800 మంది సహాయకులకు ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు.
News January 21, 2026
జనవరి 21: చరిత్రలో ఈరోజు

1924: సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు వ్లాదిమిర్ లెనిన్ మరణం
1950: ప్రముఖ బ్రిటిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ మరణం
1952: సినీనటుడు ప్రదీప్ రావత్ జననం
1986: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్(ఫొటోలో) జననం
2011: తెలుగు సినీ దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ మరణం
1972: త్రిపుర, మణిపుర్, మేఘాలయ రాష్ట్రాల ఆవిర్భావం


