News August 18, 2024

ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్: పొన్నం

image

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రూ.1100 కోట్లతో 25వేల స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ప్రతి ప్రభుత్వ స్కూలుకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు శానిటేషన్ సిబ్బంది, స్కావెంజర్ల కోసం ప్రతి నెలా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నిన్న HYD కార్వాన్‌లోని కుల్సుంపుర MPP, UPP స్కూళ్లను మంత్రి సందర్శించారు.

Similar News

News January 27, 2026

దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు

image

దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు పంట దిగుబడిని, కాపుకొచ్చిన కాయల నాణ్యతనూ తగ్గిస్తోంది. తెగులుకు కారణమయ్యే బ్యాక్టీరియా.. మొక్క ఆకులు, రెమ్మలు, కాయలపైన మచ్చలను కలగజేస్తుంది. ఈ తెగులుకు గురైన మొక్క ఆకులు రాలిపోవడం, కొమ్మలు విరిగిపోవడం జరుగుతుంది. కాయలపై ముదురు గోధుమ రంగు నుంచి నలుపు రంగు గరుకు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల మధ్యభాగంలో కాయలపై పగుళ్లు ఏర్పడి మార్కెట్‌కు పనికిరాకుండాపోతాయి.

News January 27, 2026

ఛలో మేడారం.. రేపే మహాజాతర ప్రారంభం

image

TG: ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం గిరిజన మహాజాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి సమ్మక్క-సారలమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈసారి జాతరను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం రూ.251Crతో ఆలయ పునరుద్ధరణ చేపట్టింది. సుమారు 3Cr మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా. రాష్ట్రం నలుమూలల నుంచి TGSRTC 4వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది. 15 వేల మంది సిబ్బందితో పోలీసు శాఖ భారీ బందోబస్తు నిర్వహిస్తోంది.

News January 27, 2026

కరువుకు మామిళ్లు, కాలానికి నేరేళ్లు

image

సాధారణంగా వర్షాలు సరిగా కురవక, ఎండలు ఎక్కువగా ఉండి కరవు పరిస్థితులు ఉన్నప్పుడు మామిడి చెట్లు విపరీతంగా కాస్తాయి. వాతావరణంలో వేడి పెరిగే కొద్దీ మామిడి పండ్ల దిగుబడి, తీపి పెరుగుతాయి. అలాగే వర్షాలు సమృద్ధిగా కురిసి, వాతావరణం చల్లబడినప్పుడు నేరేడు పండ్లు పుష్కలం వస్తాయి. కరవు సమయంలో ఆహారం కోసం మామిడి పండ్లను, వానాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే నేరేడు పండ్లను ప్రకృతి మనకు ప్రసాదిస్తుందని ఈ సామెత అర్థం.