News September 4, 2025

రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత ఆరోగ్య బీమా

image

APలోని పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ భేటీ అయిన మంత్రివర్గం యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఈ పాలసీని అమలు చేయనుంది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానాన్ని రూపొందించింది. 1.63 కోట్ల కుటుంబాలకు హైబ్రిడ్ విధానంలో 3,257 చికిత్సలు అందించనుంది.

Similar News

News September 4, 2025

సంపూర్ణ చంద్రగ్రహణం.. ఏం చేయాలంటే?

image

ఈనెల 7న సంభవించే <<17544453>>సంపూర్ణ చంద్రగ్రహణం<<>> సమయంలో గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. గ్రహణం ఆదివారం రాత్రి 9.56గంటలకు మొదలై అర్ధరాత్రి 1.26 గంటల వరకు ఉండనుంది. ‘గర్భిణులు దర్భలను(గరిక) తమ దగ్గర పెట్టుకోవాలి. నిద్రించే స్థలంలోనూ ఉంచుకోవాలి. గ్రహణానికి ముందు, తర్వాత తల స్నానం చేయాలి. సాయంత్రం 6లోపు ఆహారం తినాలి. ఆహార వస్తువులు, పూజ గదిలో దర్భలను వేయాలి’ అని సూచిస్తున్నారు.

News September 4, 2025

ఒకటే క్లాస్: ఒకరి ఫీజు రూ.10లక్షలు.. మరొకరికి ఫ్రీ

image

రిజర్వేషన్ల కారణంగా ఒకే క్లాసులోని విద్యార్థులు వేర్వేరు ఫీజులు చెల్లించడాన్ని ఓ ప్రొఫెసర్ Xలో లేవనెత్తారు. పుణేలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలోని ఫస్ట్ ఇయర్ ఫీజు చార్టును ఆమె షేర్ చేశారు. ఇందులో ఓపెన్ కేటగిరీకి రూ.10L, EBC & OBC విద్యార్థులకి రూ.6 లక్షలు ఫీజు చెల్లించాలని ఉంది. అదే SC&ST వాళ్లకి ఎలాంటి ఫీజు లేదు. ‘ఇది సమానత్వం అనుకుంటారా?’ అని ట్వీట్ చేయగా వైరలవుతోంది.

News September 4, 2025

క్యాబినెట్ భేటీలో సుగాలి ప్రీతి కేసు ప్రస్తావన

image

AP: క్యాబినెట్ భేటీ సందర్భంగా సుగాలి ప్రీతి కేసు విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వ్యాఖ్యానించారు. అయితే ప్రీతి ఫ్యామిలీకి అండగా ఉన్నందుకు తనను టార్గెట్ చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా సీఎం దృష్టికి తెచ్చారు. కాగా అధికారంలోకి వచ్చాక పవన్ తన కూతురి కేసును పట్టించుకోవడం లేదని ఇటీవల ప్రీతి తల్లి ఆరోపించారు.