News April 18, 2024
వారికి ఫ్రీగా ఐపీఎల్ మ్యాచ్ ఎంట్రీ

నిన్న అహ్మదాబాద్లో జరిగిన గుజరాత్, ఢిల్లీ మ్యాచ్కు క్యాన్సర్, తలసేమియా బాధితులకు ఫ్రీ ఎంట్రీ కల్పించారు. వారితోపాటు కుటుంబసభ్యులకు కూడా ఉచితంగా మ్యాచ్ చూపించారు. వారిలో సంతోషం, ప్రేరణ కలిగించేందుకే ఈ సౌకర్యం కల్పించినట్లు తెలుస్తోంది. దాదాపు 12 వేలమందికి ఉచిత ప్రవేశం కల్పించారు. బీసీసీఐ కార్యదర్శి జై షా చొరవతో వీరికి ఈ సదుపాయం కల్పించినట్లు సమాచారం.
Similar News
News January 21, 2026
రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ.. అంతా ఉత్తిదే!

సోషల్ మీడియాలో RGF(రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ) తెగ వైరలవుతోంది. ఓ యూట్యూబర్ చేసిన తుంటరి పని దీనికి కారణమని సమాచారం. హీరో రాజశేఖర్ను ఓనర్గా పేర్కొంటూ ఓ వీడియో చేయగా ఫేక్ అపాయింట్మెంట్స్, ఐడీ కార్డ్స్, శాలరీలు అంటూ పోస్టులు పుట్టుకొచ్చాయి. ఇందులో ఏదీ నిజం కాదని, ఒకరిని చూసి మరొకరు ట్రెండ్ చేస్తున్నారని తెలుస్తోంది. యూట్యూబ్లో వచ్చే ఇలాంటి వీడియోలను గుడ్డిగా నమ్మొద్దని పలువురు సూచిస్తున్నారు.
News January 21, 2026
23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ

TG: రికార్డు స్థాయిలో ఈ వారం 23 వేల మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.261.51 కోట్లు చెల్లించినట్లు హౌసింగ్ ఎండీ గౌతం తెలిపారు. ఈ మార్చికల్లా లక్ష ఇళ్లను పూర్తి చేయడంతో పాటు తదుపరి దశను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైనట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో రూ.4,351 కోట్లకు పైగా నిధులు విడుదల చేశామన్నారు.
News January 21, 2026
చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతున్నారా?

వాతావరణ మార్పుల వల్ల చర్మం తీవ్రంగా దెబ్బతింటోంది. అందుకే దాని పీహెచ్ సరిగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. చర్మాన్ని రక్షిస్తూ ఎసిడిక్ ఫిల్మ్ ఉంటుంది. దాని pH 4.5- 5.5 మధ్య ఉండేలా చూసుకోవాలి. లేదంటే మొటిమలు, దద్దుర్లు, పొడిబారడం, అతిగా నూనెలు విడుదలవ్వడం, ఎగ్జిమా వంటి సమస్యలు వస్తాయి. పీహెచ్ బ్యాలెన్స్డ్ ప్రొడక్ట్స్, సన్స్క్రీన్ వాడాలి. స్క్రబ్బింగ్ ఎక్కువగా చేయకూడదని సూచిస్తున్నారు.


