News February 10, 2025
శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఉచితంగా లడ్డూ: ఆనం

AP: ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలం బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి తెలిపారు. భక్తులకు ఇబ్బందిలేకుండా తాగునీరు, ఆహారం అందిస్తామని చెప్పారు. శ్రీశైలం పార్కింగ్ నుంచి సత్రాల వరకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ప్రతి భక్తుడికీ ఫ్రీగా లడ్డూ ప్రసాదం ఇస్తామని పేర్కొన్నారు. ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ను డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తామని వివరించారు.
Similar News
News January 31, 2026
న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలకు అప్లై చేశారా?

న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(<
News January 31, 2026
శనివారం రోజున శ్రీవారి పూజ ఎలా చేయాలి?

ఉదయాన్నే స్నానమాచరించి, నుదుట తిరునామం ధరించాలి. పూజగదిని రంగవల్లికలు, పుష్పాలతో అలంకరించి వేంకటేశ్వర స్వామిని శ్రీహరిగా భావించాలి. స్వామికి తులసి దళాలతో అర్చన చేసి, పాలు, పండ్లు లేదా చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఉదయం, సాయంత్రం ధూపదీపాలతో స్వామిని కొలవాలి. ఈ రోజు శ్రీనివాసుని కథా పారాయణం చేయడం వల్ల పనుల్లో జాప్యాలు తొలగి, గోవిందుడి కృపాకటాక్షాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.
News January 31, 2026
కోళ్లలో కొక్కెర వ్యాధి లక్షణాలు

కొళ్లలో కొక్కెర వ్యాధి చాలా ప్రమాదకరమైనది. దీన్ని రాణిఖేత్ డిసీజ్ అని కూడా అంటారు. ఇది సోకిన కోడి ముక్కు నుంచి చిక్కని ద్రవం కారుతుంది. పచ్చటి, తెల్లటి నీళ్ల విరేచనాలు అవుతాయి. కాళ్లు, మెడ, రెక్కల్లో పక్షవాతం, మెడ వంకర్లు తిరిగి, రెక్కలు, ఈకలు ఊడిపోతాయి. శ్వాస సమయంలో శబ్దం వస్తుంది. తోలు గుడ్లు పెడతాయి. వ్యాధి తీవ్రమైతే పల్టీలు కొడుతూ వ్యాధి సోకిన 3 నుంచి 4 రోజుల్లో కోళ్లు మరణిస్తాయి.


