News September 4, 2024
రైతులకు ఫ్రీగా పంప్ సెట్లు: సీఎం రేవంత్

TG: రైతులను సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలని CM రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ‘భవిష్యత్ అవసరాల దృష్ట్యా విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలి. వినియోగంలో లేని భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలి. రైతులకు సోలార్ పంప్ సెట్లు ఫ్రీగా ఇవ్వాలి. మిగులు విద్యుత్పై ఆదాయం వచ్చేలా ప్రణాళికలు చేయాలి. కొండారెడ్డిపల్లిలో పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించాలి’ అని విద్యుత్ శాఖపై సమీక్షలో CM ఆదేశించారు.
Similar News
News December 6, 2025
MBBS ప్రవేశాల్లో బాలికలదే పైచేయి: మంత్రి

AP: ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి GOVT, PVT వైద్య కళాశాలల్లో MBBS ప్రవేశాలు ముగిశాయి. ఇందులో 60.72% అడ్మిషన్లు అమ్మాయిలే పొందినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత రెండేళ్లతో పోల్చితే వీరి ప్రవేశాలు 3.66% పెరిగాయన్నారు. 2023-24లో 57.06%, 2024-25లో 57.96%, 2025-26లో 60.72% మంది అమ్మాయిలు సీట్లు పొందారని చెప్పారు. స్కూల్ దశ నుంచే ప్రణాళికతో చదువుతూ ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు.
News December 6, 2025
లైఫ్ సపోర్ట్పై ‘ఇండీ కూటమి’: ఒమర్

బిహార్ CM నితీశ్ NDAలోకి వెళ్లడానికి ఇండీ కూటమే కారణమని J&K CM ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. రెండేళ్ల కిందట కూటమి కన్వీనర్గా తన అభ్యర్థిత్వాన్ని కొందరు అడ్డుకున్నారని చెప్పారు. HT లీడర్షిప్ సమ్మిట్లో మాట్లాడుతూ ‘బిహార్ మహాగట్బంధన్లో JMM చేరలేదు. రేపు జాతీయస్థాయిలోనూ అది కూటమిని వీడితే తప్పెవరిది? ప్రస్తుతం మా కూటమి లైఫ్ సపోర్ట్పై ఉంది. కొందరైతే దాని కథ ముగిసిందంటున్నారు’ అని పేర్కొన్నారు.
News December 6, 2025
కంపెనీలు ఈ బిల్లుకు మద్దతివ్వాలి: ఉద్యోగులు

లైఫ్లో ఉద్యోగం ఓ పార్ట్. కానీ ప్రస్తుతం ఉద్యోగమే జీవితమైపోతోంది. టెకీలైతే రోజులో 12-14 గంటలు పనిచేస్తున్నారు. దీంతో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. పని ఒత్తిడితో కుటుంబాన్ని కూడా పట్టించుకోవట్లేదు. అందుకే ‘<<18487853>>రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు<<>>’ను తీసుకురావాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగి మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే పనిలో ఉత్పాదకత మెరుగుపడుతుంది. ఈ బిల్లుకు కంపెనీలూ మద్దతు ఇవ్వాలంటున్నారు.


