News September 4, 2024

రైతులకు ఫ్రీగా పంప్ సెట్‌లు: సీఎం రేవంత్

image

TG: రైతులను సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలని CM రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ‘భవిష్యత్ అవసరాల దృష్ట్యా విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలి. వినియోగంలో లేని భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలి. రైతులకు సోలార్ పంప్ సెట్‌లు ఫ్రీగా ఇవ్వాలి. మిగులు విద్యుత్‌పై ఆదాయం వచ్చేలా ప్రణాళికలు చేయాలి. కొండారెడ్డిపల్లిలో పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించాలి’ అని విద్యుత్ శాఖపై సమీక్షలో CM ఆదేశించారు.

Similar News

News December 5, 2025

iBOMMA రవికి జాబ్ ఆఫర్ చేయలేదు: డీసీపీ

image

iBOMMA రవికి తాము జాబ్ ఆఫర్ చేయలేదని, ప్రచారంలో ఉన్న వార్తలు అవాస్తవమని సైబర్ క్రైం DCP అరవింద్ బాబు తెలిపారు. 8 రోజుల కస్టడీలో కొన్నింటికి సమాధానం చెప్పాడని, తప్పు చేసిన బాధ అతనిలో లేదని వెల్లడించారు. 3 బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు ఆధారాలు గుర్తించామన్నారు. ఆర్థిక లావాదేవీలపై ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉందన్నారు. iBOMMAకు అనుబంధంగా ఉన్న మిర్రర్ సైట్లను మూసేసినట్లు డీసీపీ చెప్పారు.

News December 5, 2025

సంక్రాంతి బరిలో బాలకృష్ణ?

image

అనివార్య కారణాలతో బాలకృష్ణ అఖండ-2 మూవీ రిలీజ్ వాయిదా పడింది. అయితే మరో మూడు వారాలు ఆగితే సంక్రాంతి ఫీవర్ వచ్చేస్తుంది. వరుస సెలవులతో థియేటర్ల వద్ద సందడి నెలకొంటుంది. ఈ క్రమంలో సినిమాకు వచ్చిన అడ్డంకులు తొలగించుకుని వాయిదా పడిన అఖండ-2ను సంక్రాంతి బరిలో నిలిపే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అటు చిరంజీవి, ప్రభాస్‌తో సహా పలువురి సినిమాలు జనవరిలో రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి.

News December 5, 2025

శుక్రవారం రోజున ఉప్పు కొంటున్నారా?

image

ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. అలాగే శుక్రవారమన్నా అమ్మవారికి ఇష్టమే. అందుకే శుక్రవారం రోజున ఉప్పు కొంటే చేసిన అప్పులు త్వరగా తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరిసంపదలు కలుగుతాయని అంటున్నారు. ‘సంపాదనలో భాగంగా మొదటి ఖర్చును ఉప్పుపైనే పెట్టడం ఎంతో శుభకరం. శుక్రవారం రోజున ఉప్పు కొంటే దారిద్ర్యం తొలగిపోతుంది. మంగళ, శని వారాల్లో ఉప్పు కొనకూడదు’ అని సూచిస్తున్నారు.