News March 17, 2024
పదో తరగతి విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం

తూ.గో జిల్లా వ్యాప్తంగా మార్చి 18వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోందని జిల్లా ప్రజా రవాణా అధికారి షర్మిల అశోక తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్లకు తమ హాల్ టిక్కెట్లు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. విద్యార్థులు గమనించాలన్నారు.
Similar News
News January 27, 2026
తూ.గో: APPSC పరీక్షలపై డ్రోన్ నిఘా

తూ.గో. జిల్లావ్యాప్తంగా APPSC పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. అక్రమాలను అరికట్టేందుకు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నామని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీస్ బృందాలు విధుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు అభ్యర్థులు, సిబ్బంది సహకరించాలని ఆయన కోరారు.
News January 25, 2026
BREAKING.. రుడా పరిధిలో భూముల విలువ పెంపు

రుడా పరిధిలో భూముల మార్కెట్ విలువలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా రిజిస్ట్రార్ సత్యనారాయణ ఆదివారం తెలిపారు. ఈ పెంపు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. రాజమండ్రిలో ఆదివారం కలెక్టర్ మేఘ స్వరూప్ దీనిపై సమావేశం నిర్వహించారు. పెంపుపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 29 లోపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తెలపాలని కోరారు. పెరిగిన ధరలు అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలకు వర్తిస్తాయన్నారు.
News January 25, 2026
రాజమండ్రి: రేపు PGRS కార్యక్రమం రద్దు

రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో గణతంత్ర వేడుకల నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన PGRSను రద్దు చేసినట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్ ఆదివారం తెలిపారు. రిపబ్లిక్ డే కారణంగా రెవెన్యూ క్లినిక్ అర్జీల స్వీకరణ ఉండదని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.


