News October 25, 2024

ఉచిత ఇసుక పాలసీ.. కీలక ఉత్తర్వులు

image

AP: రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని మరింత సులభతరం చేసింది. సీనరేజీ ఫీజు విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 21న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమల్లోకి తీసుకొచ్చింది. దీనిలో భాగంగా సీనరేజీ ఫీజు, మెరిట్ ఆన్ శాండ్, డీఎంఎఫ్ మాఫీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో స్థానికంగా ఇసుక లభ్యత, రవాణా పెరుగుతుందని తెలిపింది.

Similar News

News January 17, 2026

మేడారం మహాజాతర.. ప్రధాన ఘట్టాలు!

image

TG: మేడారం మహాజాతర మరో 11 రోజుల్లో ప్రారంభం కానుంది. ముఖ్య కార్యక్రమాల వివరాలు ఇలా..
* ఈ నెల 28(బుధవారం) సాయంత్రం 4 గంటలకు సారలమ్మ గద్దెకు వచ్చే సమయం
* 29(గురువారం) సాయంత్రం 5 గంటలకు సమ్మక్క గద్దెకు వచ్చే సమయం
* 30(శుక్రవారం) అమ్మవార్లకు మొక్కులు చెల్లించుట
* 31(శనివారం) సాయంత్రం 4 గంటలకు సమ్మక్క-సారలమ్మ వనప్రవేశం
** ఈ నెల 19న సీఎం రేవంత్ గద్దెల పునరుద్ధరణ ప్రారంభోత్సవం చేస్తారు.

News January 17, 2026

మోదీ అండతో మనం మరింత ముందుకెళ్లాలి: CM

image

దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయని CM చంద్రబాబు తెలిపారు. ‘ఏపీకి ఉన్న అన్ని రకాల వనరులు ఉపయోగించుకుంటున్నాం. ఇటీవల రూ.8.75 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతి ఇచ్చాం. గ్రీన్ హైడ్రోజన్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్ మిషన్, డేటా సెంటర్లు, రోబోటిక్స్ వస్తున్నాయి. నాలెడ్జ్ ఎకానమీలో ముందున్న వారే విజేతలు అవుతారు. PM మోదీ అండతో మనం మరింత ముందుకెళ్లాలి’ అని కాకినాడలో సూచించారు.

News January 17, 2026

H1B వీసాలు.. డాక్టర్లే ఎక్కువగా సంపాదిస్తున్నారట!

image

అమెరికాలో H1B వీసాలతో టెకీల కంటే మెడికల్ స్పెషలిస్టులే ఎక్కువగా సంపాదిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. కొందరు స్పెషలిస్టుల (రేడియాలజిస్టులు, కార్డియాలజిస్టులు, సర్జన్లు, న్యూరాలజిస్టులు) జీతాలు 3 లక్షల డాలర్ల కంటే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. డాక్టర్ల తర్వాత లాయర్లు, కంప్యూటర్ సిస్టమ్ మేనేజర్లు, ఫైనాన్స్ మేనేజర్లు లక్ష-2 లక్షల డాలర్లు సంపాదిస్తున్నారని తెలిపింది.