News February 18, 2025
బీసీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు

AP: బీసీల్లో వెలుగులు నింపేందుకు CM CBN కృషి చేస్తున్నారని గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి గురుమూర్తి తెలిపారు. ఆదరణ-3 పథకం ద్వారా 80వేల మంది మహిళలకు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి కుట్టుమిషన్లను అందజేయనున్నట్లు వివరించారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో 50 శాతం రాయితీతో జనరిక్ ఔషధ షాపుల ఏర్పాటుకు సహకరిస్తామన్నారు. కల్లు గీత, కుమ్మరి, వడ్రంగి, వడ్డెర, భవన నిర్మాణ కార్మికులకు తోడ్పాటునందిస్తామన్నారు.
Similar News
News December 10, 2025
దారిద్ర్య దహన గణపతి స్తోత్రం

సువర్ణ వర్ణ సుందరం సితైక దంత బంధురం
గృహీత పాశ మంకుశం వరప్రదా భయప్రధమ్|
చతుర్భుజం త్రిలోచనం భుజంగ మోపవీతినం
ప్రఫుల్ల వారిజాసనం భజామి సింధురాననమ్||
కిరీట హార కుండలం ప్రదీప్త బాహు భూషణం
ప్రచండ రత్న కంకణం ప్రశోభితాంఘ్రి యష్టికమ్|
ప్రభాత సూర్య సుందరాంబర ద్వయ ప్రధారిణం
సరత్న హేమనూపుర ప్రశోభితాంఘ్రి పంకజమ్||
పూర్తి స్తోత్రం కోసం <
News December 10, 2025
IISERBలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్( <
News December 10, 2025
పారిశ్రామిక పార్కుల్లో APదే అగ్రస్థానం

AP: దేశవ్యాప్తంగా ఉన్న 4,597 పారిశ్రామిక పార్కుల్లో అత్యధికంగా 638 ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల సహాయమంత్రి జితిన్ ప్రసాద లోక్సభలో వెల్లడించారు. MPలు పుట్టా మహేశ్, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మహారాష్ట్ర 527 పార్కులతో రెండో స్థానంలో, రాజస్థాన్ 460తో మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో 169 పారిశ్రామిక పార్కులు ఉన్నాయన్నారు.


