News August 2, 2024

నీరజ్ స్వర్ణం గెలిస్తే.. కస్టమర్లకు ఫ్రీ వీసా ఆఫర్!

image

అట్లిస్ CEO మోహక్ ప్రకటించిన ఫ్రీ వీసా ఆఫర్ SMలో బజ్ క్రియేట్ చేసింది. ‘ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే ప్రతి ఒక్కరికీ ఫ్రీగా వీసా పంపిస్తా’ అని జులై 30న ఆయన లింక్డిన్‌లో పోస్టు పెట్టారు. వెంటనే.. ఫ్రీగా ఇస్తారా? ఎందరికి ఇస్తారు? వివరాలేంటని ప్రశ్నల వర్షం కురిసింది. దీంతో ‘ఒకరోజు ఒకరికి ఒక ఫ్రీ వీసా ఇస్తాను’ అని ఆయన జవాబిచ్చారు. ప్రతిదీ ప్రచారం కోసమేనా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

Similar News

News February 3, 2025

మొరాయిస్తున్న ఇస్రో ఉపగ్రహం

image

గత నెల 29న ఇస్రో ప్రయోగించిన NVS-02 ఉపగ్రహంలో స్వల్ప సాంకేతిక ఇబ్బంది తలెత్తింది. ఆక్సిడైజర్లను సరఫరా చేసే వాల్వ్‌లు తెరచుకోకపోవడంతో ఇంజిన్లు మొరాయిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. ఇంజిన్లు ఫైర్ అయితేనే శాటిలైట్‌ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది. భారత్‌ సొంత నేవిగేషన్ వ్యవస్థ అయిన నావిక్‌కు NVS-02 కీలకం. ఈ నేపథ్యంలో పరిష్కార మార్గాల్ని ఇస్రో అన్వేషిస్తోంది.

News February 3, 2025

నేడు ఈ స్కూళ్లకు సెలవు!

image

వసంత పంచమి పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. దీంతో హిందుత్వ, ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లకు ఈరోజు సెలవు ఉండనుంది. మిగిలిన విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలా లేదా అనేది యాజమాన్యాలపై ఆధారపడి ఉంటుంది. అటు ఏపీలో ఎలాంటి ఆప్షనల్ హాలిడే లేదు. మరి మీకు సెలవు ఉందా? కామెంట్ చేయండి.

News February 3, 2025

వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యక్తే CM: తీన్మార్ మల్లన్న

image

TG: వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యక్తి CM అవడం ఖాయమని, రేవంత్ రెడ్డే చివరి OC CM అని కాంగ్రెస్ MLC తీన్మార్ మల్లన్న అన్నారు. హనుమకొండలో ‘బీసీ రాజకీయ యుద్ధభేరి’ సభలో ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు BCలే ఓనర్లు అని, అవసరమైతే BRS పార్టీని కొనేంత డబ్బు తమ దగ్గర ఉందని అన్నారు. OC వర్గాల నుంచే 60మంది MLAలు ఉన్నారని, బీ ఫారం ఇవ్వని వారితో BCలకు ఇక యుద్ధమేనని ఘాటుగా వ్యాఖ్యానించారు.