News March 17, 2024
స్వేచ్ఛాయుత ఓటింగే లక్ష్యం: రోనాల్డ్ రోస్

ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణాన్ని కల్పిస్తామని GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. మే 13న జిల్లా పరిధిలోని HYD, SEC పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నిక జరగనుందని, కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉపఎన్నిక ఉంటుందన్నారు. ఫిబ్రవరి 8 నాటికి లెక్కల ప్రకారం జిల్లాలో 45,70,138 మంది ఓటర్లున్నారని, గడిచిన 2 నెలల్లో 1.21 లక్షల ఓట్లు రద్దయ్యాయని, 46,574 మంది కొత్తఓటర్లు జాబితాలో చేరారన్నారు.
Similar News
News April 2, 2025
HYD: పల్లె నుంచి పట్నంకు తాటి ముంజలు

నగరవాసుల వేసవి తాపాన్ని తీర్చేందుకు తాటిముంజలు వచ్చేశాయి. ముషీరాబాద్, రాంనగర్ డౌన్, బయోలజికల్ ఈ లిమిటెడ్, అడిక్మెట్ ఫ్లై ఓవర్ తదితర ప్రాంతాల్లో ఈ వ్యాపారం జోరందుకుంది. డజన్ మంజలు రూ.120 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు. ఇవి తింటే జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. వడదెబ్బ తాకిన వారు వీటిని తింటే వెంటనే కోలుకుంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధతో ధరలు ఎక్కువున్నా HYD వాసులు కొనేందుకు మొగ్గుచూపుతున్నారు.
News April 2, 2025
HYDలో అందమైన ప్రదేశాలు చూపిస్తానని అత్యాచారం

జర్మనీ యువతిపై అత్యాచారం కేసులో CP ఆదేశాలతో మహేశ్వరం DCP సునీత సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. సోమవారం సా. 6 గంటలకు యువతి, ఆమె స్నేహితుడిని అస్లాం కారులో ఎక్కించుకుని యాకుత్పురా, చార్మినార్లో తిప్పాడు. సిటీ శివారులో అందమైన ప్రదేశాలు చూపిస్తాను అంటూ పహడీషరీఫ్ తీసుకెళ్లాడు. యువతి ఫ్రెండ్ను కారు దింపి యూటర్న్ చేస్తాను అని నమ్మించాడు. కొద్దిదూరం తీసుకెళ్లి <<15963281>>ఆమెపై<<>> అత్యాచారం చేశాడు ప్రబుద్ధుడు.
News April 1, 2025
HYD: కారులో జర్మనీ యువతితో అసభ్య ప్రవర్తన

మీర్పేటలో కలకలం రేగింది. తన స్నేహితురాలిని కలిసేందుకు వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో జర్మనీకి చెందిన యువతి మందమల్లమ్మ వద్ద కారు ఎక్కింది. కొద్దిదూరం వెళ్లాక క్యాబ్ డ్రైవర్, అందులో ఉన్న వ్యక్తి పహాడిషరీఫ్ ప్రాంతంలో ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధితురాలు తప్పించుకొని పారిపోయింది. మీర్పేట PSలో ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేసి పహాడీషరీఫ్ పోలీసులకు బదిలీచేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.