News August 22, 2024

గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ: కేటీఆర్

image

TG: వ్యాపారవేత్త అదానీకి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి నిరసనలు చేయడం ఈ ఏడాదిలోనే పెద్ద జోక్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఆయనను ఆహ్వానించి, ఒప్పందాలు చేసుకొని ఇప్పుడతడినే మోసగాడిగా చూపిస్తున్నారని విమర్శించారు. గల్లీలో స్నేహంగా ఉంటూ ఢిల్లీలో ఫైట్ చేయడం కాంగ్రెస్‌లోనే ఉంటుందన్నారు. ఇదెలాగో వివరించాలని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.

Similar News

News November 25, 2025

కడప కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సప్ ఖాతా.. తస్మాత్ జాగ్రత్త

image

కడప కలెక్టర్ పేరు మీద నకిలీ నంబర్‌తో వాట్సప్ ఖాతాను సృష్టించి మోసాలకు పాల్పడుతున్న వారిని ప్రజలు నమ్మవద్దని కలెక్టర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గుర్తుతెలియని వ్యక్తి కలెక్టర్ పేరుతో వాట్సప్ ఖాతాను క్రియేట్ చేసినట్లు తమ కార్యాలయ దృష్టికి వచ్చిందన్నారు. ఆ ఖాతా కలెక్టర్‌ది కాదని సృష్టం చేశారు. కలెక్టర్ ఫొటోలు వాడి మోసం చేసేందుకు ప్రయత్నాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

News November 25, 2025

కడప కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సప్ ఖాతా.. తస్మాత్ జాగ్రత్త

image

కడప కలెక్టర్ పేరు మీద నకిలీ నంబర్‌తో వాట్సప్ ఖాతాను సృష్టించి మోసాలకు పాల్పడుతున్న వారిని ప్రజలు నమ్మవద్దని కలెక్టర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గుర్తుతెలియని వ్యక్తి కలెక్టర్ పేరుతో వాట్సప్ ఖాతాను క్రియేట్ చేసినట్లు తమ కార్యాలయ దృష్టికి వచ్చిందన్నారు. ఆ ఖాతా కలెక్టర్‌ది కాదని సృష్టం చేశారు. కలెక్టర్ ఫొటోలు వాడి మోసం చేసేందుకు ప్రయత్నాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

News November 25, 2025

హీరోల రెమ్యునరేషన్ తగ్గిస్తే టికెట్ రేట్లు ఎందుకు పెరుగుతాయ్?

image

సినిమా టికెట్ రేట్ల పెరుగుదలకు టాప్ హీరోల రెమ్యునరేషనే ప్రధాన కారణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అగ్ర హీరోలు ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు తీసుకుంటున్నారు. దీనివల్లే బడ్జెట్ పెరుగుతోందని, పెట్టిన డబ్బులు రాబట్టేందుకు నిర్మాతలు ప్రేక్షకులపై టికెట్ల భారం మోపుతున్నారని చెబుతున్నారు. అలాగే థియేటర్లలో స్నాక్స్ రేట్లను కంట్రోల్ చేయాలని సూచిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?