News August 11, 2024

16 నుంచి నామినేటెడ్ పదవుల పండుగ?

image

AP: ఈ నెల 16 నుంచి నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో దాదాపు 90 కార్పొరేషన్లు, సంస్థలు ఉండగా 40 వరకు భర్తీ చేయొచ్చని సమాచారం. పొత్తుల్లో భాగంగా సీటు కోల్పోయిన ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు ఈ పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. మొత్తం పదవుల్లో 60 శాతం టీడీపీ, 30 శాతం జనసేన, 10 శాతం బీజేపీకి దక్కనున్నట్లు సమాచారం.

Similar News

News April 4, 2026

బరువు ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే..

image

ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేస్తూ, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. కొన్ని అలవాట్లను పాటిస్తే బరువు పెరగకుండా జాగ్రత్తపడొచ్చంటున్నారు నిపుణులు. రాత్రి 8 తర్వాత ఆహారం తీసుకోకూడదు. ఆలస్యంగా, ఎక్కువ మోతాదులో తినడంతో జీవక్రియలకు అంతరాయం కలుగుతుంది. ప్రాసెస్డ్‌ ఫుడ్‌, నూడిల్స్‌, వేపుళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. శరీరానికి తగినంత నీరు అందేలా చూసుకోవాలి.

News April 4, 2026

₹57,821 కోట్లతో అమరావతి నిర్మాణాలు: CBN

image

AP: అమరావతి నిర్మాణాలను గడువులోగా పూర్తిచేసేలా పనులు వేగవంతం చేయాలని CM చంద్రబాబు సంస్థలను ఆదేశించారు. ‘రాజధానిని నిర్మించే అవకాశం అందరికీ దక్కదు. ఈ నిర్మాణాన్ని కాంట్రాక్టు వర్కుగా చూడొద్దు. ప్రస్తుతం ఈ నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న 20వేల మంది కార్మికులు, నిపుణులకు అదనంగా మరింత మందిని నియమించాలి’ అని సూచించారు. YCP రద్దు చేసిన పనులనూ సమస్యలు పరిష్కరించి పూర్తి చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News April 4, 2026

వ్యవసాయంలో విత్తనశుద్ధితో ప్రయోజనాలు

image

వ్యవసాయంలో విత్తనశుద్ధి చేయడం వల్ల.. విత్తనాలు, నేల ద్వారా ఆశించే తెగుళ్లు, పురుగుల నుంచి పంటను సంరక్షించవచ్చు. మొక్కలలో మొలకశాతం పెరుగుతుంది. పంట తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. మొక్కలు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని పెరుగుతాయి. విత్తనాలు త్వరగా మొలకెత్తి ఏకరీతిగా ఎదుగుతాయి. శుద్ధి చేయడం వల్ల విత్తనాలను ఎక్కువకాలం నిల్వ చేయవచ్చు.