News May 11, 2024

ఓటు కోసం విదేశాల నుంచి..

image

AP: వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు ఏపీకి తరలివస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం అత్యంత రద్దీగా మారింది. ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఓటర్లు ఇక్కడ దిగుతున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో స్థిరపడ్డ వారు సైతం సొంతూళ్లకు తరలివస్తున్నారు. రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. దీంతో ఈసారి ఓటింగ్ శాతం భారీగా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Similar News

News February 6, 2026

ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>IIT <<>>గువాహటి 10 జూనియర్ ఇంజినీర్(ట్రైనీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిప్లొమా (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఫిబ్రవరి 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. నెలకు స్టైపెండ్ రూ.25,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.iitg.ac.in/

News February 6, 2026

‘ఫార్మర్ రిజిస్ట్రీ’ ఎక్కడ నమోదు చేస్తారు? ఏ పత్రాలు కావాలి?

image

తెలంగాణలో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను రైతు వేదికలోని వ్యవసాయ విస్తరణా అధికారి(AEO) ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గరలో ఉన్న మీ-సేవ కేంద్రాల్లో రూ.15 చెల్లిస్తే నమోదు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించాలి. దీని కోసం ఆధార్ కార్డు, భూమి పాస్‌బుక్, ఆధార్ లింకై ఉన్న మొబైల్ నంబర్ ఉండాలి. వీటిని తీసుకొని రైతులు పైన సూచించిన కేంద్రాలకు వెళ్లాలి.

News February 6, 2026

ఇంట్లో సానుకూల శక్తి పెరగాలంటే..?

image

లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సానుకూల శక్తి పొందాలంటే ఈ సూత్రాలు పాటించాలి.
1.పాత, పనికిరాని వస్తువులను తొలగించి ఇంటిని ప్రశాంతంగా ఉంచాలి. 2.నిత్య దీపారాధనతో ఇంటి ప్రతికూలత తొలగి దైవిక కాంతి పెరుగుతుంది. 3.శుక్ర, మంగళవారాల్లో పూజలు, ధూపం వేయడం శుభప్రదం. 4.నిశ్చలమైన భక్తితో దైవ ప్రార్థన చేయాలి. ఫలితంగా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 5.శుభ్రత, వెలుతురు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.