News March 6, 2025

ఇకపై ‘మనమిత్ర’లో 200 సేవలు: లోకేశ్

image

AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’లో ఇకపై ప్రజలకు 200 సేవలు అందుతాయని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘మన మిత్ర’ అద్భుత మైలురాయి దాటిందన్నారు. ఈ ఏడాది జనవరిలో 161 సేవలతో ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ గవర్నెన్స్‌కు ఇదో నిదర్శనం అని లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు.

Similar News

News March 6, 2025

రన్యారావు తండ్రిపై గతంలో ఆరోపణలు

image

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన నటి <<15652905>>రన్యారావు<<>> తండ్రి రామచంద్రరావు (DGP) కర్ణాటక హౌసింగ్ కార్పొరేషన్ CMDగా ఉన్నారు. 2014లో ఈయన IGPగా ఉన్నప్పుడు కేరళకు వెళ్తున్న బస్సును మైసూరు దగ్గర ఆపి రూ.20 లక్షల నగదును సీజ్ చేశారు. అయితే అందులో రూ.2.27 కోట్లు ఉన్నాయని, పోలీసులు డబ్బును పక్కదారి పట్టించారని ఆ వ్యాపారులు వెల్లడించారు. ఈ కేసును సీఐడీ విచారించింది. కొన్ని రోజులకు ఆయనకు వేరే పోస్టింగ్ ఇచ్చారు.

News March 6, 2025

21 Years: అమెరికాలో భయం గుప్పిట్లో భారతీయ యూత్!

image

H4 వీసా కింద మైనర్లుగా అమెరికాకు వలసవెళ్లిన భారతీయులు భయం భయంగా బతుకుతున్నారు. వారికి 21 ఏళ్లు వస్తుండటమే ఇందుకు కారణం. H1B వీసా కలిగిన తల్లిదండ్రుల వద్ద వారు ఇకపై డిపెండెంట్లుగా ఉండలేరు. సాధారణంగా H4 నుంచి ఇతర వీసాలు పొందేందుకు గతంలో రెండేళ్ల గడువు ఉండేది. ఇప్పుడా విధానం రద్దు చేశారు. FY26 H1B వీసా ప్రక్రియకు కేవలం 17 రోజులే టైమిచ్చారు. దీంతో యువత UK, కెనడా వంటి దేశాలకు వెళ్లాలని భావిస్తోంది.

News March 6, 2025

గంభీర్, రోహిత్ అలా.. షమీ ఇలా

image

CTలో IND తన మ్యాచులన్నీ దుబాయ్‌లోనే ఆడటం అడ్వాంటేజ్‌గా మారిందని పేసర్ షమీ అన్నారు. ‘ఒకే గ్రౌండ్‌లో ఆడుతుండటం మాకు హెల్ప్ అవుతోంది. పిచ్ కండిషన్స్, బిహేవియర్ గురించి తెలుస్తుంది’ అని పేర్కొన్నారు. అయితే అంతకుముందు ఈ అంశంపై గంభీర్, రోహిత్ భిన్నంగా స్పందించారు. పిచ్ కండిషన్స్ ప్రతీ మ్యాచుకు మారుతున్నాయని, తాము ప్రాక్టీస్ చేసే ICC అకాడమీ, మ్యాచ్ ఆడే దుబాయ్ గ్రౌండ్ పిచ్‌లు డిఫరెంట్ అని పేర్కొన్నారు.

error: Content is protected !!