News April 15, 2025
నేటి నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’

AP: వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నేటి నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’ కార్యక్రమం చేపట్టనుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లో 9552300009 నంబర్ను సేవ్ చేస్తారు. దాన్ని ఉపయోగించే విధానాన్ని ప్రజలకు వివరిస్తారు. ప్రస్తుతం 250కిపైగా సేవలు వాట్సాప్లో అందుతుండగా జూన్ నాటికి ప్రభుత్వం 500 సేవలకు విస్తరించనుంది.
Similar News
News November 22, 2025
రేపు ఒంగోలులో జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలు

ఒంగోలులోని డాక్టర్ BR అంబేడ్కర్ భవనంలో ఆదివారం 12వ జాతీయ స్థాయి కరాటే, కుంగ్ ఫు ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బ్లాక్ బెల్ట్ 7వ డాన్ కరాటే మాస్టర్ వెంకటేశ్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ.. జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలకు 13 రాష్ట్రాల నుంచి మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు రానున్నట్లు తెలిపారు. క్రీడల ప్రాముఖ్యతను తెలిపేందుకు పోటీలు దోహదపడతాయన్నారు.
News November 22, 2025
ఇనుప తీగల ఉచ్చుతో ఎలుకల నియంత్రణ

ఎలుకల నివారణకు ఈ పద్ధతి చక్కగా ఉపయోగపడుతుంది. ఇనుప తీగలు, వెదురు, తాటాకులతో తయారు చేసిన బుట్టలను ఎకరానికి 20 వరకు ఏర్పాటు చేయాలి. ఎలుకలను ఆకర్షించడానికి వాటిలో ఉల్లిపాయలు, టమాట, ఎండుచేపలు, బజ్జీలు లాంటివి ఉంచాలి. వీటిని పొలం గట్ల వెంబడి, గోదాముల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. వరిలో నారుమడి పోసిన దగ్గర నుంచి దమ్ములు పూర్తై నాట్లు వేసిన నెల వరకు.. కోతల తర్వాత ఏర్పాటు చేస్తే ఎలుకలను సమర్థంగా నివారించవచ్చు.
News November 22, 2025
కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించాలి: DYFI

AP: కానిస్టేబుల్ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా శిక్షణ ప్రారంభించకపోవడంపై DYFI మండిపడింది. దీనివల్ల అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపింది. 6,100 మందికి వెంటనే ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది. ఈ పోస్టులకు 2022లో నోటిఫికేషన్ వెలువడగా లీగల్ సమస్యలతో ప్రక్రియ ఆలస్యమైంది. ఈ ఏడాది జూన్లో మెయిన్స్ నిర్వహించి AUGలో రిజల్ట్స్ ప్రకటించారు.


