News April 15, 2025

నేటి నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’

image

AP: వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నేటి నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’ కార్యక్రమం చేపట్టనుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో 9552300009 నంబర్‌ను సేవ్ చేస్తారు. దాన్ని ఉపయోగించే విధానాన్ని ప్రజలకు వివరిస్తారు. ప్రస్తుతం 250కిపైగా సేవలు వాట్సాప్‌లో అందుతుండగా జూన్ నాటికి ప్రభుత్వం 500 సేవలకు విస్తరించనుంది.

Similar News

News December 2, 2025

మెదక్: GP ఎన్నికలు.. లెక్క తప్పితే వేటు తప్పదు !

image

స్థానిక ఎన్నికల నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన ప్రచార ఖర్చులను సర్పంచ్‌కి రూ.2.5లక్షల నుంచి రూ.1.5లక్షల వరకు ఈసీ ఖరారు చేసింది. గ్రామాల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డు అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా లెక్కకు మించి భారీగా వెచ్చిస్తున్నారు. దీంతో డబ్బు ప్రవాహం కట్టడికి ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసి పరిశీలిస్తోంది. వ్యయ పరిమితి దాటితే వేటు తప్పదు జాగ్రత్త.

News December 2, 2025

NSICలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్(NSIC)లో 5 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. బీఈ/బీటెక్, CA/CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, MSME రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nsic.co.in

News December 2, 2025

గొర్రెలకు సంపూర్ణాహారం అందకపోతే జరిగేది ఇదే

image

గొర్రెలకు సరైన పోషకాహారం అందకుంటే పెరుగుదల లోపించి త్వరగా బరువు పెరగవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి సులభంగా వ్యాధుల బారిన పడతాయి. అంతర, బాహ్య పరాన్న జీవుల కారణంగా గొర్రెలకు వ్యాధుల ముప్పు పెరుగుతుంది. గొర్రెల ఉన్ని రాలిపోతుంది. పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. గర్భస్రావాలు, పిల్లలు తక్కువ బరువుతో, బలహీనంగా జన్మించడం, సకాలంలో ఎదకు రాకపోవడం, ఈతల మధ్య వ్యవధి పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.