News March 26, 2024

రేపటి నుంచే జగన్ ‘మేమంతా సిద్ధం’ యాత్ర

image

AP: రేపటి నుంచి సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. తొలుత ఇడుపులపాయలో ప్రార్థనల అనంతరం యాత్ర ప్రారంభం కానుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ ప్రజలతో మమేకం కానున్నారు. దాదాపు 21 రోజులు యాత్ర కొనసాగించనున్నారు. వైజాగ్, ఏలూరు, అనంతపురం, బాపట్ల మినహా అన్ని జిల్లాల్లో ఈ యాత్ర జరగనుంది. రోజుకో పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ యాత్ర కొనసాగనుంది.

Similar News

News April 9, 2026

రోహిత్ శర్మ బయోపిక్?

image

రోహిత్ శర్మ ఇన్‌స్టా స్టోరీ కొత్త చర్చకు దారితీసింది. నెట్‌ఫ్లిక్స్, MI లోగోలతో ఉన్న కాపీని ఆయన పోస్ట్ చేశారు. అందులో టైటిల్ నేమ్ దగ్గర ముందు పదాన్ని కొట్టివేయగా, లాస్ట్‌లో ఛాంపియన్ అని కనిపిస్తోంది. అలాగే జెర్సీ నంబర్ 45, ఆయన పేరు, ఇవాళ్టి డేట్ ప్రింట్ చేసి ఉన్నాయి. దీంతో నెట్‌ఫ్లిక్స్ రోహిత్ బయోపిక్‌/డాక్యుమెంటరీ తీస్తోందా లేక ఏదైనా షోలో ఆయన పాల్గొంటున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

News April 9, 2026

15 రోజులు షూటింగ్.. 15 రోజులు రేసింగ్

image

ఏడాది తర్వాత తమిళ నటుడు అజిత్ ఓ మూవీకి ఓకే చెప్పారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో హిట్ ఇచ్చిన డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌తో సినిమా చేయబోతున్నారు. మే తొలివారంలో షూటింగ్ ఆరంభం కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. అయితే తనకిష్టమైన 2 ప్యాషన్స్‌ను బ్యాలెన్స్ చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారట. నెలలో 15రోజులు షూటింగ్, 15రోజులు రేసింగ్ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఆయనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

News April 9, 2026

భారత తొలి టెస్ట్ విన్నింగ్ టీమ్ ఆఖరి ప్లేయర్ మృతి

image

భారత్ టెస్ట్ దిగ్గజం CD గోపీనాథ్ (96) కన్నుమూశారు. చెన్నైలోని తన కుమార్తె నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1951-52లో ENGతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఆయన సెకండ్ టెస్ట్‌లో 50, 42 స్కోర్స్ చేశారు. ఈ 5 మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో IND చెన్నైలో జరిగిన ఆఖరి టెస్ట్‌లో గెలుపొంది తన తొలి టెస్ట్ విక్టరీ నమోదు చేసింది. ఆ జట్టులో ఇప్పటివరకు జీవించిన ఆఖరి ప్లేయర్ గోపీనాథ్ ఒక్కరే కావడం గమనార్హం.