News March 1, 2025

రేపటి నుంచి దబిడి దిబిడే..

image

TG: ఆదివారం నుంచి రాష్ట్రం నిప్పులకొలిమిని తలపిస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిత్యం 36-38.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంటూ అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న భద్రాచలంలో అత్యధికంగా 38.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అటు రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. MAR, APR, MAY నెలల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD సూచించింది.

Similar News

News October 17, 2025

హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లవద్దు: బీజేపీ ఎమ్మెల్యే

image

మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే గోపిచంద్ పడల్కర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘దయచేసి హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లొద్దు. అక్కడ మీ ట్రైనర్ ఎవరో తెలియదు. మంచిగా మాట్లాడే వ్యక్తిని చూసి మోసపోకండి. అర్థం చేసుకోండి. ఇంట్లోనే యోగా ప్రాక్టీస్ చేసుకోండి’ అని బీడ్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.

News October 17, 2025

509 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేశారా?

image

ఢిల్లీ పోలీస్ విభాగంలో 509 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 3 రోజులే (OCT 20) సమయం ఉంది. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పురుషులకు 341, మహిళలకు 168 జాబ్‌లు ఉన్నాయి. వయసు 18- 25 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష, PE&MT, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 17, 2025

రేపు రాష్ట్ర బంద్‌.. స్కూళ్లు, బస్సులు నడుస్తాయా?

image

TG: రేపు రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్‌ సహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రేపు బంద్ సంపూర్ణంగా ఉంటుందని అంచనా. ఇప్పటికే పలు ప్రైవేట్ స్కూళ్లు రేపు సెలవు ప్రకటిస్తూ తల్లిదండ్రులకు మెసేజ్‌లు పంపుతున్నాయి. కాగా దీపావళి నేపథ్యంలో ఉదయం దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు Way2Newsకు వెల్లడించారు. అంతర్రాష్ట్ర బస్సులు మధ్యాహ్నం తర్వాత యథావిధిగా నడిచే ఛాన్సుంది.