News May 3, 2024

రెండు సీట్ల నుంచి 400+ టార్గెట్‌కి..!

image

‘అబ్ కీ బార్ 400 పార్’.. అనే నినాదాన్ని బీజేపీ ఈ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వినియోగిస్తోంది. 1984లో రెండు సీట్లకే పరిమితమైన ఈ పార్టీ ఇప్పుడు దేశ రాజకీయాలను శాసించడం చర్చనీయాంశమైంది. హిందుత్వవాదంపై ఏర్పడిన ఈ పార్టీకి 1990ల్లో రామమందిరం ఉద్యమంతో గ్రాఫ్ గణనీయంగా పెరిగింది. 1996లో కేవలం 13 రోజులే ప్రభుత్వాన్ని నడిపిన బీజేపీ ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధపడింది. <<-se>>#Elections2024<<>>

Similar News

News October 22, 2025

నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు నేటి నుంచి 3 రోజుల పాటు యూఏఈలో పర్యటించనున్నారు. ఇవాళ 10amకు హైదరాబాద్ నుంచి దుబాయ్ బయలుదేరుతారు. వచ్చే నెల 14-15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు వివిధ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా మూడు రోజుల్లో రోడ్ షోతో పాటు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ కానున్నారు.

News October 22, 2025

కార్తీకం: ప్రమిదల్లో ఎన్ని వత్తులు ఉండాలి?

image

కార్తీక మాసంలో ప్రమిదలో రెండు వత్తులను వెలిగిస్తే శాంతి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 3 వత్తులు ధనవృద్ధినీ, నాలుగు ఐశ్వర్యాన్నీ, ఐదు అఖండ సంపదల్నీ, ఏడు మోక్షాన్నీ ప్రసాదిస్తాయంటున్నారు. మనలో ఉండే పంచతత్వాలకు నిదర్శనంగా 5 రుచులతో ఉండే ఉసిరికపైనా దీపాన్ని వెలిగించవచ్చని పేర్కొంటున్నారు. అయితే ఒక వత్తిని వెలిగించినా పుణ్యం లభిస్తుందని వివరిస్తున్నారు.

News October 22, 2025

ఐస్‌లాండ్‌లో కనిపించిన దోమలు

image

ఇందులో విడ్డూరం ఏముంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ మంచు దేశానికి దోమలు లేని దేశంగా పేరుంది. తాజాగా వెస్టర్న్ ఐస్‌ల్యాండ్‌లోని ఓ అడవిలో ఈ దోమలను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్నేళ్ల కిందట విమానంలో ఓ దోమను గుర్తించగా తాజాగా సహజ వాతావరణంలోనే ఈ కీటకాలను కనుగొన్నట్లు వెల్లడించారు. అయితే ఇవి ఎలా వచ్చాయనే విషయమై కారణాలను అన్వేషిస్తున్నారు. కాగా ఇది మారిన వాతావరణ పరిస్థితులకు అద్దం పడుతోంది.