News June 14, 2024
జులై 22న పూర్తి స్థాయి బడ్జెట్?

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 22న ప్రారంభం కానున్నట్లు సమాచారం. అదే రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 9 వరకు కొనసాగనున్నాయట. ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 1న కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.
Similar News
News January 7, 2026
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఉద్యోగాలు

ఒడిశా కోరాపుట్ డివిజన్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<
News January 7, 2026
₹46,750 కోట్ల వెనిజులా బంగారం స్విట్జర్లాండ్కు!

వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురో హయాంలో ఏకంగా $5.2 బిలియన్ల (దాదాపు ₹46,750 కోట్లు) విలువైన బంగారం స్విట్జర్లాండ్కు తరలిపోయింది. 2013 నుంచి 2016 మధ్య సుమారు 113 మెట్రిక్ టన్నుల బంగారాన్ని రిఫైనింగ్ పేరుతో అక్కడికి పంపారు. దేశ ఆర్థిక సంక్షోభం సాకుతో ఈ అమ్మకాలు జరిగాయి. మదురో అరెస్ట్ కావడంతో స్విస్ బ్యాంకులు ఆయన ఆస్తులను స్తంభింపజేశాయి. అయితే ఈ గోల్డ్ తరలింపు వెనక గుట్టు ఏంటనే దానిపై క్లారిటీ లేదు.
News January 7, 2026
వైభవ్ మరో సెంచరీ

యూత్ క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ హవా కొనసాగిస్తున్నారు. U19 సౌతాఫ్రికాతో జరుగుతోన్న మూడో వన్డేలో 63 బంతుల్లో సెంచరీ చేశారు. ఇందులో 8 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్లో ఆరోన్(85) కూడా శతకానికి చేరువలో ఉన్నారు.
* మ్యాచ్ను యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.


