News May 13, 2024
రేపు మధ్యాహ్నం వరకు పూర్తి పోలింగ్ శాతం: సీఈవో

TG: రేపు మధ్యాహ్నం వరకు పూర్తి పోలింగ్ శాతం తెలుస్తుందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ‘రాష్ట్రంలో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. 1400 కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలో ఉన్నారు. మొత్తం 44 స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయి. శాంతిభద్రతల విషయంలో ఇబ్బందులు రాలేదు. ఈరోజు 400 ఫిర్యాదులు వచ్చాయి. 38 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి’ అని వివరించారు.
Similar News
News March 10, 2026
తిరుమల వెళ్లేవారికి బిగ్ అలర్ట్

సర్వదర్శనం టోకెన్లు, రూ.300 టికెట్ కలిగిన భక్తులను స్లాట్ కేటాయించిన సమయంలోనే క్యూ లైన్లలోకి అనుమతిస్తామని టీటీడీ తెలిపింది. ముందు లేదా ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వచ్చే సోమవారం నుంచి దీన్ని కఠినంగా అమలు చేస్తామని, భక్తులు గమనించి సహకరించాలని కోరింది. గంటల తరబడి క్యూ లైన్లలో భక్తుల ఇబ్బందులను తప్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు TTD వెల్లడించింది.
News March 10, 2026
గాయపడ్డ మొజ్తబా ఖమేనీ?

ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ గాయపడినట్లు వార్తలొస్తున్నాయి. ఆ దేశ TV ఛానల్ ఒకటి ఆయనను ‘జాన్బాజ్ ఆఫ్ రంజాన్’(గాయపడ్డ యుద్ధ వీరుడు) అని సంబోధించడమే ఈ వార్తలకు కారణమని India Today తెలిపింది. మొజ్తబా ఎన్నికను ట్రంప్ ఇప్పటికే వ్యతిరేకించారు. దీంతో US-ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్కు గాయాలయ్యాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా దాడుల్లో ఇప్పటికే అలీ ఖమేనీ, కుటుంబం మృతి చెందింది.
News March 10, 2026
గ్యాస్తో పని లేకుండా ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోండి

గల్ఫ్ యుద్ధంతో సిలిండర్ల కొరత ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ ఆదా చేసుకోవడం బెటర్. వీలైనంత వరకు స్టవ్తో పనిలేని ఫుడ్ సిద్ధం చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్లో దోశ, పూరి, వడ లాంటివి పక్కన పెట్టి సలాడ్స్, శాండ్విచ్, స్ప్రౌట్స్, మిక్స్డ్ ఫ్రూట్స్, బ్రెడ్-జామ్, బాయిల్డ్ ఎగ్స్(ఎగ్ బాయిలర్లో ఉడికించినవి), జ్యూస్లు తీసుకోవాలి. ఇవి మీ సిలిండర్ను ఆదా చేయడమే కాకుండా ఆరోగ్యానికీ మంచివి.
Share it


