News January 23, 2025
ఆ సెంటిమెంట్ వల్లే ఏపీకి నిధులు: కేంద్ర మంత్రి

AP: విశాఖ స్టీల్ ప్లాంట్పై ఆంధ్రుల సెంటిమెంట్ను గౌరవించి కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. ఈ ప్యాకేజీ కింద రూ.11,440 కోట్లు కేటాయించామన్నారు. ‘ప్లాంట్ను కాపాడేందుకే ఈ ప్యాకేజీ ఇచ్చారు. భవిష్యత్లో మరో ప్యాకేజీ ఇస్తాం. స్టీల్ ప్లాంట్ను నష్టాల్లోంచి లాభాల్లోకి తీసుకొస్తాం. ఇక పరిశ్రమను కాపాడడానికి ఇంత మొత్తంలో ఇవ్వడం ఇదే తొలిసారి’ అని పేర్కొన్నారు.
Similar News
News December 17, 2025
పృథ్వీ షా SAD పోస్ట్.. అంతలోనే!

IPL మినీ వేలంలో తొలిసారి పృథ్వీ షా పేరు రాగానే కొనడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. దీంతో ఆయన it’s ok అని హార్ట్ బ్రేక్ సింబల్ను ఇన్స్టా స్టోరీగా పెట్టారు. కాసేపటికే 2వ రౌండ్లో DC రూ.75 లక్షలకు కొనుగోలు చేయగా దాన్ని డిలీట్ చేసి ‘BACK TO MY FAMILY’ అని పోస్ట్ చేశారు. గతంలో 7 సీజన్లు DCకి ఆడిన షా 79 మ్యాచుల్లో 1,892 రన్స్ చేశారు. 2025 మెగా వేలం ముందు DC ఆయన్ను వదులుకోగా ఏ జట్టూ కొనలేదు.
News December 17, 2025
కేంద్ర సాయుధ బలగాల్లో 438 ఆత్మహత్యలు

కేంద్ర సాయుధ బలగాలు (CAPFs), అస్సాం రైఫిల్స్, NSGలో 2023-25 మధ్య 438మంది సైనికులు సూసైడ్ చేసుకున్నారని కేంద్రం లోక్సభలో తెలిపింది. అత్యధికంగా CRPFలో 159ఆత్మహత్యలు నమోదైనట్లు చెప్పింది. అటు 2014-2025 మధ్య CAPF, అస్సాం రైఫిల్స్లో 23,360మంది ఉద్యోగానికి రాజీనామా చేశారని, ఇందులో BSFలో ఎక్కువ మంది 7,493మంది ఉన్నారంది. ఈ ఏడాది 3,077మంది రిజైన్ చేయగా వారిలో 1,157మంది BSF సైనికులున్నట్లు చెప్పింది.
News December 17, 2025
SRH ఫుల్ టీమ్ ఇదే!

IPL మినీ వేలంలో కొత్త ప్లేయర్లను కొనుగోలు చేసిన తర్వాత SRH ఫుల్ టీమ్ చూసేయండి. అభిషేక్, అనికేత్ వర్మ, కార్సే, ఇషాన్ మలింగ, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, క్లాసెన్, ఇషాన్ కిషన్, ఉనద్కత్, కమిందు మెండిస్, నితీశ్, కమిన్స్, స్మరణ్, హెడ్, జీషన్ అన్సారి, సలీల్ అరోరా, శివంగ్ కుమార్, లివింగ్స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, అమిత్ కుమార్, క్రైన్స్ ఫులేట్రా, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలే, ప్రఫుల్ హింగే, శివమ్ మావి.


