News August 18, 2024
నిధుల్ని త్వరగా విడుదల చేయాలి: PMతో సీఎం చంద్రబాబు

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న AP CM చంద్రబాబు PM మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలతో భేటీ అయ్యారు. ఆ వివరాలను ఆయన కార్యాలయం వెల్లడించింది. ‘ఏపీకి చేసిన కేటాయింపులపై ప్రధానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం నిధుల విడుదలపై క్యాబినెట్లో ఆమోదించాలని కోరారు. ‘అమరావతి’ నిధుల్ని త్వరగా విడుదల చేయాలని, పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు’ అని వివరించింది.
Similar News
News October 17, 2025
వంటింటి చిట్కాలు

* ఇడ్లీ, దోశకు బియ్యం నానబెట్టే ముందు కాస్త వేయించాలి. ఇలా చేస్తే ఇడ్లీ మెత్తగా, దోశలు కరకరలాడుతూ ఉంటాయి.
* బంగాళదుంపలతో కలిపి నిల్వ చేస్తే వెల్లుల్లి చాలా కాలం తాజాగా ఉంటాయి.
* అప్పడాలు, వడియాలు వేయించే ముందు కాసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి.
* అరటిపండ్లను ప్లాస్టిక్ డబ్బాలో వేసి, ఫ్రిజ్లో పెడితే నల్లగా మారవు.
<<-se>>#VantintiChitkalu<<>>
News October 17, 2025
BCCI అపెక్స్ కౌన్సిల్లో చాముండేశ్వరనాథ్

భారత మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్ చాముండేశ్వరనాథ్కు BCCI అత్యున్నత కమిటీలో చోటు దక్కింది. బోర్డు అపెక్స్ కౌన్సిల్లో ICA ప్రతినిధిగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఆన్లైన్ ఓటింగ్లో వి.జడేజాపై ఆయన గెలుపొందారు. దీంతో అపెక్స్ కౌన్సిల్కు ఎంపికైన తొలి తెలుగు వ్యక్తిగా నిలిచారు. రాజమండ్రికి చెందిన ఈయన ఆంధ్ర తరఫున ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడారు. జాతీయ జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్గానూ పనిచేశారు.
News October 17, 2025
ఉపరాష్ట్రపతి నివాసానికి బాంబు బెదిరింపు

చెన్నైలోని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆయన ఇంట్లో బాంబు పెట్టామంటూ దుండగులు మెయిల్ పంపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు.