News September 13, 2024
నిబంధనలు పెట్టకుండా నిధులివ్వండి: రేవంత్

TG: రాష్ట్రంలో సంభవించిన వరదల నష్టానికి ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయం కింద నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. సెక్రటేరియట్లో ఆయన కేంద్ర బృందంతో భేటీ అయ్యారు. వరదల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టి, నిధి ఏర్పాటు చేయాలన్నారు. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మాణం తదితర అంశాలను కేంద్ర బృందం దృష్టికి సీఎం తీసుకెళ్లారు.
Similar News
News March 10, 2026
లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 339 పాయింట్ల లాభంతో 77,905 వద్ద, నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 24,122 వద్ద కొనసాగుతోంది. క్రూడాయిల్ ధరలు దిగిరావడం, యుద్ధం ముగింపునకు వచ్చిందని ట్రంప్ ప్రకటించడం మార్కెట్లకు పాజిటివ్గా మారింది. సెన్సెక్స్-30 సూచీలో ఇండిగో, అల్ట్రాటెక్, M&M, టైటాన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. రిలయన్స్, ఇన్ఫీ, ఎటర్నల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News March 10, 2026
జార్జియాకు బై.. అంటార్కిటికాకు ‘వారణాసి’ టీమ్?

రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ మూవీ జార్జియా షెడ్యూల్ ముగిసింది. మహేశ్ బాబు, పృథ్వీరాజ్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. మూవీ యూనిట్ త్వరలోనే అంటార్కిటికాకు వెళ్లనుందని టాక్. ఈ షెడ్యూల్లో సూపర్ స్టార్తోపాటు ప్రియాంకా చోప్రా పాల్గొంటారని, అక్కడే ఓ సాంగ్ షూట్ జరుగుతుందని సినీ వర్గాలు వెల్లడించాయి. దీంతో అక్కడి లోకేషన్స్లో షూట్ చేసిన తొలి ఇండియన్ మూవీగా నిలవనుందని తెలిపాయి.
News March 10, 2026
వంటగ్యాస్ పొదుపుగా వాడుకుంటే బెటర్!

పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత వంటగ్యాస్ సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. కేంద్రం భరోసా ఇచ్చినా బిహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో LPG కొరత కనిపిస్తోంది. గ్యాస్ కోసం భారత్ ప్రధానంగా గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతోంది. దేశంలో చమురు తరహాలో LPGని భారీగా నిల్వ చేసే సామర్థ్యం లేదు. ఈ ఛాలెంజెస్ దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో వంటగ్యాస్ను పొదుపుగా వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


