News May 24, 2024
ఇకపై ఆన్లైన్లో ఇంటర్ ప్రశ్నపత్రాల మూల్యాంకనం

AP: ఇంటర్ ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్ని ఆన్లైన్లో నిర్వహించేలా ఇంటర్మీడియట్ విద్యామండలి కొత్త విధానం తీసుకురానుంది. ప్రస్తుత సప్లిమెంటరీ పరీక్షల నుంచే దీన్ని ప్రారంభిస్తారు. ఒక్కో అధ్యాపకుడు తమకు పంపిన 50 ప్రశ్నపత్రాలను.. వారి కళాశాలల్లో CC కెమెరాల పర్యవేక్షణలో దిద్దాల్సి ఉంటుంది. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరితో ఒక్కో పేపర్ మూల్యాంకనం చేయిస్తారు. అత్యధిక మార్కుల్ని పరిగణనలోకి తీసుకుంటారు.
Similar News
News November 18, 2025
నేడు ఇలా చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి

కృష్ణాంగారక చతుర్దశి ఎన్నో శుభాలను కలిగించే పవిత్రమైన రోజు. నేడు ఎర్ర పూలు/కుంకుమ కలిపిన నీటితో స్నానం చేస్తే అంగారకుడి కటాక్షం కలుగుతుందట. ఆదిత్య మంత్రం 12 సార్లు పలికితే సూర్యుడు అనుగ్రహిస్తాడని నమ్మకం. పితృ తర్పణంతో రుణ బాధలు తొలగి, సంతోషంగా ఉంటారట. గోధుమలు దానమిస్తే జాతకంలో రవి బలం బాగుంటుందట. యమ దీపం వెలిగిస్తే అప్పుల బాధలు తొలగి, కుజ దోషం పోయి సొంతింటి కల నెరవేరుతుందని పండితులు అంటున్నారు.
News November 18, 2025
నేడు ఇలా చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి

కృష్ణాంగారక చతుర్దశి ఎన్నో శుభాలను కలిగించే పవిత్రమైన రోజు. నేడు ఎర్ర పూలు/కుంకుమ కలిపిన నీటితో స్నానం చేస్తే అంగారకుడి కటాక్షం కలుగుతుందట. ఆదిత్య మంత్రం 12 సార్లు పలికితే సూర్యుడు అనుగ్రహిస్తాడని నమ్మకం. పితృ తర్పణంతో రుణ బాధలు తొలగి, సంతోషంగా ఉంటారట. గోధుమలు దానమిస్తే జాతకంలో రవి బలం బాగుంటుందట. యమ దీపం వెలిగిస్తే అప్పుల బాధలు తొలగి, కుజ దోషం పోయి సొంతింటి కల నెరవేరుతుందని పండితులు అంటున్నారు.
News November 18, 2025
అమెరికాతో త్వరలోనే ట్రేడ్ డీల్!

ఇండియా, అమెరికా మధ్య తొలి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) త్వరలోనే ఖరారు కానుందని తెలుస్తోంది. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘BTAపై అమెరికాతో చర్చిస్తున్నాం. ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకదానికి సమయం పడుతుంది. రెండోది రెసిప్రోకల్ టారిఫ్స్ను పరిష్కరించే ప్యాకేజీ. దీని విషయంలో డీల్కు దగ్గరగా ఉన్నాం’ అని వెల్లడించాయి.


